Category
భద్రాద్రి కొత్తగూడెం
తెలంగాణ  భద్రాద్రి కొత్తగూడెం  తెలంగాణ మెయిన్  

సోమవారం జరగనున్న ప్రజావాణి రద్దు

సోమవారం జరగనున్న ప్రజావాణి రద్దు ఖమ్మం, జూన్ 15:ఈ నెల 16వ తేది సోమవారం జరగవలసిన ప్రజావాణి కార్యక్రమం రద్దు అయినట్టు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అదే రోజున రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాలోని అన్ని రైతు...
Read More...
తెలంగాణ  భద్రాద్రి కొత్తగూడెం  తెలంగాణ మెయిన్  

భద్రాచలం ఆసుపత్రిలో సేవా కార్యక్రమం

భద్రాచలం ఆసుపత్రిలో సేవా కార్యక్రమం భద్రాచలం, జూన్ 15:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కేంద్ర బీజేపీ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు కుంజ ధర్మా పుట్టినరోజు సందర్భంగా కుంజ సత్యవతి సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న రోగులకు, గర్భిణీ మహిళలకు బియ్యం బ్రెడ్, పాలు,...
Read More...
తెలంగాణ  భద్రాద్రి కొత్తగూడెం  తెలంగాణ మెయిన్  

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు భద్రాచలం, జూన్ 15:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం MLA క్యాంప్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రాచలం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా వేడుకలను నిర్వహించారు. పుట్టిన రోజు సందర్భంగా నాయకులు ప్రత్యేకంగా కేక్ కట్ చేసి,...
Read More...
తెలంగాణ  భద్రాద్రి కొత్తగూడెం  తెలంగాణ మెయిన్  

చిన్న నల్లబల్లిలో గిరిజనుల కోసం కొత్త డిఆర్ డిపో ప్రారంభం

చిన్న నల్లబల్లిలో గిరిజనుల కోసం కొత్త డిఆర్ డిపో ప్రారంభం 13-06-25 భద్రాచలం నియోజకవర్గం. భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్ముగూడెం మండలంలో గల చిన్న నల్లబల్లి గ్రామంలో గిరిజన ప్రాథమిక సహకార మార్కెటింగ్ సంఘం ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన డిఆర్ డిపో ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన భద్రాచలం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు రిబ్బన్ కట్ చేసి డిపోను ప్రారంభించారు. అనంతరం...
Read More...
తెలంగాణ  భద్రాద్రి కొత్తగూడెం  తెలంగాణ మెయిన్  

బాల కార్మికులపై అవగాహన కల్పించాలి – పిల్లల భవిష్యత్తు బడిలోనే నిర్మితమవుతుంది

బాల కార్మికులపై అవగాహన కల్పించాలి – పిల్లల భవిష్యత్తు బడిలోనే నిర్మితమవుతుంది భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 12: బాల కార్మికులను గుర్తించి వారిని పాఠశాలలో చేర్పించి వారి భవిష్యత్తును వెలిగించాలన్నారు జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం తన కార్యాలయంలో ఎయిడ్ (Action for Integrated Development) సంస్థ రూపొందించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అదనపు...
Read More...
తెలంగాణ  భద్రాద్రి కొత్తగూడెం  తెలంగాణ మెయిన్  

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివాసీ అభివృద్ధికి జిల్లా పోలీసుల పునాదులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివాసీ అభివృద్ధికి జిల్లా పోలీసుల పునాదులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూన్ 11 2025: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజలను అభివృద్ధి బాటలో నడిపించడంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు మరో ముందడుగు వేసారు. చర్ల మండలంలోని సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న 20 మావోయిస్టు ప్రభావిత గ్రామాలకు మినీ రైస్ మిల్లులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్...
Read More...
తెలంగాణ  భద్రాద్రి కొత్తగూడెం  తెలంగాణ మెయిన్  

తొలిబడి అమ్మ వడి.. మలి బడి అంగన్వాడి బడి:మంత్రి సీతక్క

తొలిబడి అమ్మ వడి.. మలి బడి అంగన్వాడి బడి:మంత్రి సీతక్క తొలి బడి అమ్మవడి మలి బడి అంగన్వాడీ బడి అని మంత్రి ధనసరి సీతక్క అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ముందుగా మంత్రి పాత కొత్తగూడెం నుండి పెనుబల్లి రోడ్డు 0/600 వద్ద 6.50 కోట్ల రూపాయలతో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి పనులకు కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని  సాంబశివరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి కొత్తగూడెం క్లబ్ నందు ఏర్పాటుచేసిన ఇందిరమ్మ అమృతం పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐసిడిఎస్ వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రి పరిశీలించి వేస్ట్ నుండి బెస్ట్ గారు రూపొందించిన కళాకృతులను చూసి అభినందించారు. ఆడపిల్లలకు శక్తినిద్దాం.. ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఇందిరమ్మ అమృతం పథకాన్ని మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోలిక బలరాం నాయక్, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం  వెంకట్రావు, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనిత రామచంద్రన్, మహిళ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ మరియు ఐటిడిఏ పిఓ రాహుల్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కౌమార బాలికల్లో రక్తహీనతను నివారించేందుకు ఇందిరమ్మ అమృతం పేరిట ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా భద్రాద్రి కొత్తగూడెం, కొమురం భీం ఆసిఫాబాద్ మరియు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలలో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ పథకం ద్వారా మూడు జిల్లాల్లో 50 వేల 269 మంది బాలికలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో ఆడపిల్లలు సరైన పౌష్టికాహారం లేక అనేక రకాల జబ్బులు మరియు పౌష్టికాహార లోపం తలెత్తుతుందన్నారు. వాటిని  14 నుండి 18 సంవత్సరాల లోపు బాలికలకు ఈ ఇందిరమ్మ అమృతం పథకం  ద్వారా మిల్లెట్స్ తో కూడిన చిక్కీలను నెలకు రెండు ప్యాకెట్లు అందించడం జరుగుతుందన్నారు. ఒక్కో ప్యాకెట్లో 15 చిక్కిలు ఉంటాయని రోజుకు ఒక చిక్కి తిండటం ద్వారా ఆడపిల్లలు నెలసరి టైం లో వచ్చే సమస్యలను, రక్తహీనతను తగ్గించి మరియు శక్తిని పెంపొంచే విధంగా ఈ చెక్కిలు ఉంటాయని మంత్రి తెలిపారు. ఆడపిల్లను ఎదగనిద్దాం, బ్రతకనిద్దాం, గౌరవిద్దాం.. వారిని ప్రోత్సహించి లక్ష్యాలను సాధిద్దాం అని మంత్రి పిలుపునిచ్చారు. అంగన్వాడీ కేంద్రాలన్నింటిని ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా మార్చడం జరిగిందని, పిల్లలందరికీ నర్సరీ పాటలతో  పాటు ఆహారం అందించడం జరుగుతుందన్నారు. ప్రైవేటు  పాఠశాలకు వెళ్లి తల్లిదండ్రుల కష్టాలు వృధా చేయకుండా అంగన్వాడీ కేంద్రాలు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తయారు చేస్తున్నామన్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా  అంగన్వాడీ కేంద్రాలలో ఏక రూప దుస్తులను అందిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలు ఆడుకోవడానికి 57 రకాల ఆట వస్తువులను అందుబాటులో ఉంచామన్నారు. త్వరలోనే గర్భిణీ స్త్రీలు కింద కూర్చోకుండా అన్ని అంగన్వాడి కేంద్రాలలో బల్లలను  ఏర్పాటు చేస్తామన్నారు. అంగన్వాడి సెంటర్ల నుండి దేశ భవిష్యత్ నిర్మాణం అవుతదని మంత్రి అన్నారు. అంగన్వాడి టీచర్లు పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలను ఆకర్షించే విధంగా బొమ్మలు, పెయింటింగ్ ఇటువంటి వాటి ద్వారా పాఠాలు బోధించాలన్నారు. జిల్లాలో మహిళ, శిశు సంక్షేమ శాఖ వారు తయారుచేసిన వేస్ట్ నుండి బెస్ట్ చాలా ఆకర్షించిందని వాటిని రాష్ట్రవ్యాప్తంగా చూపెడతామన్నారు. మొట్టమొదటిసారిగా అంగన్వాడీ కేంద్రాలకు నెలరోజుల వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది అన్నారు. అంగన్వాడీ టీచర్లు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్ రెండు లక్షల రూపాయలు అందించడానికి ఆమోదం తెలుపుతూ నిన్న సాయంత్రం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క  సంతకం చేశారని  తెలిపారు చిన్న చిరు ఉద్యోగుల కష్టాలు కన్నీళ్లు తుడవడమే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి అన్నారు. రాబోయే కాలంలో ఆశ వర్కర్ల జీతాల పెంపు మరియు రెగ్యులైజేషన్ చేస్తామని తెలిపారు. మిషన్ వాత్సల్య పథకం కింద తల్లిదండ్రులు లేని పిల్లలకు అండగా ప్రభుత్వం నెలకు 4 వేల రూపాయలను అందజేస్తున్నట్లు మంత్రి తెలిపారు. తల్లితండ్రులు లేని పిల్లలు బాధపడొద్దని ఇంత పెద్ద ప్రభుత్వం మీ వెంట ఉందని మంత్రి అన్నారు.ఈ పథకం కింద జిల్లాకు మంజూరు అయిన 74 లక్షల 64 వేల రూపాయల చెక్కును పిల్లలకు మంత్రి అందజేశారు. అంగన్వాడి టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ కింద రెండు లక్షల రూపాయలు ఆమోదానికి కృషిచేసిన మంత్రి సీతక్కను మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు మరియు అంగన్వాడీ టీచర్లు సన్మానించారు.
Read More...
తెలంగాణ  భద్రాద్రి కొత్తగూడెం 

భద్రాచలం దేవాలయంలో ప్రత్యేక పూజలు

భద్రాచలం దేవాలయంలో ప్రత్యేక పూజలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరియు దేవాదాయ శాఖ కమిషనర్  ఉత్తర్వుల మేరకు  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని టెర్రరిస్టులకు వ్యతిరేకంగా భారతదేశంలో శాంతి స్థాపన కొరకు త్రివిధ దళాలు చేస్తున్న కృషి మరింత విజయవంతం కావాలని భారతదేశము సుభిక్షంగా...
Read More...
తెలంగాణ  భద్రాద్రి కొత్తగూడెం 

ఆపరేషన్ చేయూత.. లొంగిపోయిన 38 మావోయిస్టులు

ఆపరేషన్ చేయూత.. లొంగిపోయిన 38 మావోయిస్టులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఆఫీస్ లో నిషేదిత CPI మావోయిస్టు పార్టీకి చెందిన (38) మంది మావోయిస్టు సభ్యులు జిల్లా ఎస్పీ గారి ఎదుట లొంగిపోయారు. జిల్లా పోలీసులు మరియు 81BN & 141 BN CRPF అధికారులు ఆదివాసీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కొరకు నిర్వహిస్తున్న కార్యక్రమాలు మరియు *ఆపరేషన్...
Read More...
తెలంగాణ  భద్రాద్రి కొత్తగూడెం 

భద్రాచలంలో భారీగా గంజాయి స్వాధీనం

భద్రాచలంలో భారీగా గంజాయి స్వాధీనం గంజాయి డ్రగ్స్ నియంత్రణ లో భాగంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. భద్రాచలం ప్రాంతంలోని గోదావరి ఇసుక ర్యాంప్ సమీపంలో అనుమానంగా వెళుతున్న కారును తనిఖీలు నిర్వహించగా  అందులో 75 కేజీల గంజాయి పట్టుబడినట్లు ఎన్ఫోర్స్మెంట్ సీఐ రమేష్ తెలిపారు.ఒరిస్సా నుంచి రాజస్థాన్ కు అక్రమంగా తరలిపోతున్న ఈ గంజాయిని...
Read More...
తెలంగాణ  భద్రాద్రి కొత్తగూడెం 

భవనం కింద పడి చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వంన్యాయం చేయాలి

భవనం కింద పడి చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వంన్యాయం చేయాలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నిన్న భద్రాచలంలో జరిగిన  6 అంతస్తులభవనం కూలిన ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని మృతుల కుటుంబ సభ్యులు బ్రిడ్జి సెంటర్ నందు ధర్నా నిర్వహించారు. అక్రమంగా అనుమతులు లేకుండా నిర్మించే బిల్డింగ్ యజమానులను శిక్షించాలని అలాగే వారికి పర్మిషన్లు ఇస్తున్నటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలనీ స్థానికులు...
Read More...

Advertisement