పాకిస్తాన్ లో ఉగ్రవాద స్థావరం నుంచి మృతదేహాలు వెలికితీత
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ ప్రతీకారం తీర్చుకున్న సంగతి తెలిసిందే. భారత భద్రతా దళాలు ఆపరేషన్ సింధూర్ నిర్వహించాయి. వైమానిక దాడి తర్వాత, ముజఫరాబాద్ లోని హఫీజ్ లష్కర్ ఉగ్రవాద స్థావరంలో భయాందోళనలు నెలకున్నాయి. అక్కడి నుంచి మృతదేహాలను వెలికి తీస్తున్నారు. ఉగ్రవాదంపై భారతదేశం జరిపిన సైనిక చర్యలో పాకిస్తాన్ ఉగ్రవాది మసూద్ అజార్ కుటుంబం నాశనమైంది. భారత వైమానిక దాడిలో, జైషే మహ్మద్ ఉగ్రవాది అజార్ కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు మరణించగా, నలుగురు అనుచరులు కూడా మరణించారు.
పాకిస్తాన్ లోని బహవల్పూర్ లో భారతదేశం జరిపిన వైమానిక దాడిలో అజార్ కుటుంబం మట్టుబెట్టబడింది. ఈ దాడిలో మౌలానా మసూద్ అజార్ అక్క, మౌలానా కషాఫ్ కుటుంబం మొత్తం, ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ మనవరాళ్ళు మరణించారని, అనేక మంది కుటుంబ సభ్యులు గాయపడ్డారని ఉగ్రవాద సంస్థ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. వైమానిక దాడిలో మరణించిన అజార్ కుటుంబ సభ్యులు, సన్నిహితుల అంత్యక్రియలు ఈరోజు నిర్వహించనున్నారు. కాగా ఈ ఘటనపై పాకిస్తాన్ ఆర్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు.