ట్రూ పాయింట్ న్యూస్ కి స్పందన.. సున్నం చెరువులో అక్రమ బోర్ల ధ్వంసం

On
ట్రూ పాయింట్ న్యూస్ కి స్పందన.. సున్నం చెరువులో అక్రమ బోర్ల ధ్వంసం

  • నీటి వ్యాపారానికి చెక్ పెట్టిన హైడ్రా అధికారులు..
  • మరోసారి వ్యాపారం సాగకుండా బోర్లను పూర్తిగా ధ్వంసం
  • బోర్లతో పాటు.. 70 గుడిసెలు.. చిరు వ్యాపార సముదాయాలు నేలమట్టం

హైదరాబాద్: ట్రూ పాయింట్ న్యూస్ కి స్పందన లభించింది. సున్నం చెరువులో అక్రమంగా బోర్లు వేసి కలుషిత నీటి వ్యాపారంపై హైడ్రా అధికారి రంగనాథ్ స్పందించారు. ఈ నీళ్లు మీరు తాగుతున్నారా.. అయితే ఖచ్చితంగా పోతారు అంటూ పాయింట్ న్యూస్ లో వార్త ప్రచురితమైంది. దీనితో హైడ్రా అధికారులు రంగంలోకి దిగి అక్రమ బోర్లను ధ్వంసం చేశారు. అంతే కాకుండా సున్నం చెరువులో వెలసిన 70కి పైగా గుడిసెలు, చిరు వ్యాపార సముదాయాలను సైతం తొలగించారు. 32 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సున్నం చెరువును 10కోట్ల రూపాయలతో అధికారులు అభివృద్ధి చేస్తున్నారు. అయితే కొందరు వ్యాపారులు అక్రమంగా బోర్లు వేసి నీటి వ్యాపారం మొదలు పెట్టారు. దీనిపై గతంలోనే రంగనాథ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ నీటిని తాగినా, వాడిన అనారోగ్యం పాలవుతారని హెచ్చరించారు. కొద్దిరోజులు బ్రేక్ పడిన మళ్ళీ వ్యాపారం మొదలైంది. దీనిపై ట్రూ పాయింట్ న్యూస్ వార్త ప్రచురితం చేయడంతో హైకోర్టు అధికారులు అక్రమ వ్యాపారుల భరతం పట్టారు. మళ్లీ వ్యాపారుల ఆగడాలు సాగకుండా బోర్లను పూర్తిగా ధ్వంసం చేశారు. వ్యాపార సముదాయాలను నేలమట్టం చేస్తున్న సమయంలో కొందరు జేసీబీ అడ్డు పడటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Latest News

ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఆయనే.. అధిష్టానం సంచలన నిర్ణయం ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఆయనే.. అధిష్టానం సంచలన నిర్ణయం
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ప్రస్తుతం మాధవ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తున్నారు....
ట్రూ పాయింట్ న్యూస్ కి స్పందన.. సున్నం చెరువులో అక్రమ బోర్ల ధ్వంసం
పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ ప్రమాదం
ఆ నీళ్లు మీరు తాగుతున్నారా.. అయితే ఖచ్చితంగా పోతారు..
వివాదానికి దారితీసిన బల్కంపేట దేవాలయ కమిటీ ఏర్పాటు
విదేశీ సిగరేట్ల దిగుమతి.. పోలీసుల దాడి. ఒకరి అరెస్ట్
మహాన్యూస్ పై దాడి కేసులో బిఆర్ఎస్ నేతల అరెస్ట్