AP Politics: పేకాట శిబిరాలకు హోల్ అండ్ సోల్ ప్రొప్రయిటర్ ఆ ఎమ్మెల్యేనా..?

By PC RAO
On
AP Politics: పేకాట శిబిరాలకు హోల్ అండ్ సోల్ ప్రొప్రయిటర్ ఆ ఎమ్మెల్యేనా..?

ఏపీలో జనసేన ఎమ్మెల్యే పేకాట డెన్

దగ్గరుండి నడిపిస్తున్న ఎమ్మెల్యేగారి తనయుడు.?

షాడో ఎమ్మెల్యేలుగా పీఏలు

భీమవరం.. ఎంత రిచ్ ఏరియానో మనకు తెలిసిందే. ఒకప్పుడు ఎయిర్ పోర్టే కావాలని ఢిల్లీకి వెళ్లారనే ప్రచారం ఉంది. అలాంటి ఏరియాలో పేకాట ఏ రేంజులో జరుగుతుందో ఊహించుకోవచ్చు. అయినా మనకు చట్టాలు, పోలీసులు ఉన్నారు కదా అనుకోవద్దు. ఇప్పుడు ఆ పేకాటకు సోల్ ప్రొపయిటర్ ఏకంగా లోకల్ ఎమ్మెల్యేగారనే ఆరోపణలు గట్టిగా వినపడుతున్నాయి. ఇక ఆయనగారి కుమారుడు ప్రశాంత్ దీనంతటికీ మేనేజరని చెప్పుకుంటున్నారు. అయితే మొదట్లోనే ప్రశాంత్ చూసినా.. తర్వాత ఆయన స్టేట్ లెవెల్ కి వెళ్లారని.. అందుకు ఇక్కడ మేనేజర్లుగా వారి మనుషులను అపాయింట్ చేశారని చెప్పుకుంటున్నారు.

అసలు పేకాట శిబిరాలకు ఓనర్ ఎమ్మెల్యే ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎమ్మెల్యే వర్గం అయితే ఈ ఆరోపణలను ఖండిస్తోంది. కాని ప్రచారం ఆగటం లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే అయిన నెల నుంచే ఇవి మొదలయ్యాయని చెప్పుకుంటున్నారు. ఆయన కుమారుడు ప్రశాంత్ సారథ్యంలో అవి నడుస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఆయన బిజీ అయ్యాక.. ఆయన డైరెక్షన్లో బాపిరాజు అనే వ్యక్తి, పీఎగా ఉన్న మధు ఇద్దరూ నడిపిస్తున్నారని టాక్.

పేకాట శిబిరాన్ని బోర్డు అంటారు. ఒక బోర్డుకు మినిమమ్ 10 లక్షలు మిగులుతాయంట. అలాంటి బోర్డులు అన్ లిమిటెడ్ గా నడుస్తున్నాయని భీమవరంలో చెప్పుకుంటున్నారు. ఎప్పుడూ లేనంతగా పెరిగిపోయాయని.. లాడ్జీలు, పొలాలు, ఫంక్షన్ హాళ్లు అన్నీ పేకాట శిబిరాలుగా మారిపోయాయంటున్నారు. టౌన్ హాల్లో రెండు బోర్డులు డైరెక్టుగా ఎమ్మెల్యే టీమ్ నిర్వహిస్తుందని చెప్పుకుంటున్నారు. రోజుకు కోట్లలోనే ఎమ్మెల్యే టీమ్ కు అందుతుందని ప్రచారం జరుగుతోంది. 

ఇది కాక మున్సిపల్ టౌన్ ప్లానింగ్ లో అయితే అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని చెప్పుకుంటున్నారు. మున్సిపల్ సిబ్బంది సైతం.. ఈసారి అవినీతి భారీగా పెరిగిందని కామెంట్లు చేస్తున్నారంట. దీనికి కారణం ఎమ్మెల్యేనే అని చెప్పుకుంటున్నారు.

అయితే ఎమ్మెల్యే గతంలో టీడీపీలో ఉన్నా.. ఈసారి జనసేన తరపున గెలిచారు. ఇంతకు ముందు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అంజిబాబు ఇలా చేయలేదని.. ఈసారే ఇలా జరుగుతుందని దీనికి కారణం ఆయన కుమారుడు ప్రశాంత్ పెత్తనమే కారణమని.. పార్టీలో చెప్పుకుంటున్నారు. పేకాట శిబిరాల నిర్వహణలో మాత్రం పార్టీతో సంబంధం లేకుండా టీడీపీ, జనసేన, కొందరు వైసీపీ వాళ్లు సైతం ఇన్ వాల్వ్ అయిపోయారని.. అందరూ ఎమ్మెల్యే ఆఫీసుతో కోఆర్డినేట్ చేసుకుంటున్నారనేది ఆరోపణ.

ఎంతో గౌరవప్రదంగా ఇన్నాళ్లు ఉన్న ఎమ్మెల్యే అంజిబాబు.. కేవలం కుమారుడు ప్రశాంత్ వలన మొత్తం పేరు చెడగొట్టుకున్నారని కొందరు కామెంట్ చేస్తున్నారు. భీమవరంలో ఆక్వా బిజినెస్ చేసేవాళ్లు ఎక్కువ కావటం.. వారి చేతుల్లో టర్నోవర్ నడుస్తుండటంతో... పేకాట శిబిరాలు గట్టిగా నడుస్తున్నాయంటున్నారు. అది ఇది అని కాకుండా.. అన్నిటిలోనూ ఇన్ వాల్వ్ అయిపోతూ షాడో ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న బాపిరాజు, అలాగే పీఎగా ఉన్న మధు మొత్తం నడిపిస్తున్నారని.. వీరికి ఎమ్మెల్యే కుమారుడు ప్రశాంత్ దే డైరెక్షన్ అంటున్నారు.

Advertisement

Latest News

ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఆయనే.. అధిష్టానం సంచలన నిర్ణయం ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఆయనే.. అధిష్టానం సంచలన నిర్ణయం
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ప్రస్తుతం మాధవ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తున్నారు....
ట్రూ పాయింట్ న్యూస్ కి స్పందన.. సున్నం చెరువులో అక్రమ బోర్ల ధ్వంసం
పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ ప్రమాదం
ఆ నీళ్లు మీరు తాగుతున్నారా.. అయితే ఖచ్చితంగా పోతారు..
వివాదానికి దారితీసిన బల్కంపేట దేవాలయ కమిటీ ఏర్పాటు
విదేశీ సిగరేట్ల దిగుమతి.. పోలీసుల దాడి. ఒకరి అరెస్ట్
మహాన్యూస్ పై దాడి కేసులో బిఆర్ఎస్ నేతల అరెస్ట్