పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ ప్రమాదం
By V KRISHNA
On
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలోని సీగాచి కెమికల్స్ పరిశ్రమలో(chemical factory) భారీ పేలుడు సంభవించింది. కార్మికులు పని చేస్తుండగా ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. దీనితో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి.ఈ ప్రమాదంలో 10మందికి పైగానే చనిపోయినట్లు సమాచారం. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. పోలీసుల సమాచారంతో ప్రమాద స్థలికి వచ్చిన అంబులెన్స్ లు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించాయి. పేలుడు భారీ శబ్దం రావడంతో భయంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. మంటల్లో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Related Posts
Latest News
30 Jun 2025 15:46:55
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ప్రస్తుతం మాధవ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తున్నారు....