ఆ అధికారుల ఫొటోలు ట్యాంక్ బండ్ మీద పెట్టండి.. హైకోర్టు

On
ఆ అధికారుల ఫొటోలు ట్యాంక్ బండ్ మీద పెట్టండి.. హైకోర్టు

హైదరాబాద్: అక్రమ నిర్మాణాలపై అధికారుల తీరు పట్ల తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు  చేసింది. అక్రమ నిర్మాణాల పట్ల చర్యలు తీసుకోని అధికారుల ఫోటోలను ట్యాంక్ బండ్‌పై ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది. రాజేంద్రనగర్‌లోని తమ ప్రైవేటు భూమిలో కొందరు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, అధికారులు పట్టించుకోవడం లేదని సయ్యద్ రహీమున్నీసా మరో ఏడుగురు వ్యక్తులు హైకోర్టుని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేస్తూ, అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోని అధికారుల ఫోటోలను ట్యాంక్ బండ్‌పై  ప్రదర్శించాలని  జస్టిస్ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. అక్రమ నిర్మాణాలు తొలగించాలని ఉత్తర్వులు జారీ చేశామని స్టాండింగ్ కౌన్సిల్ చెబుతోంది, టాస్క్ ఫోర్స్ అధికారులకు ఉత్తర్వులను పంపించామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. పోలీసుల నుండి భద్రత లేదని టాస్క్ ఫోర్స్ అధికారులు చెబుతున్నారు. అది శాంతిభద్రతల సమస్య అని పోలీసులు చెబుతున్నారు. ఇలా అందరూ చేతులు దులుపుకుంటే ఎలా అంటూ అధికారులపై అసహనం వ్యక్తం చేసింది. వచ్చే వాయిదాలోగా పిటిషనర్ ఇచ్చిన వినతి పత్రంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని అధికారులను  హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

Advertisement

Latest News

పాశమైలారం మృతులకు కోటి రూపాయల నష్ట పరిహారం.. సీఎం పాశమైలారం మృతులకు కోటి రూపాయల నష్ట పరిహారం.. సీఎం
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో గానీ తెలంగాణ రాష్ట్రంలో గానీ ఇంత భారీ ప్రమాదం జరగలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఈరోజు (మంగళవారం)...
భూదాన్ భూముల్లో ప్రహరీ నిర్మాణం.. కోర్టులో దిక్కరణ పిటిషన్ దాఖలు
యాంకర్ స్వేచ్ఛ కు జర్నలిస్టుల ఘన నివాళి 
ఆ పసివాడిది గట్టి గుండె..! అమ్మ కోసం ఏం చేశాడంటే..!
ఆ అధికారుల ఫొటోలు ట్యాంక్ బండ్ మీద పెట్టండి.. హైకోర్టు
విద్యావ్యవస్థపై మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
పక్కా ప్లాన్ ప్రకారమే చేశా.. యాంకర్ స్వేచ్ఛ కేసులో పూర్ణ స్టేట్మెంట్.