చిన్న నల్లబల్లిలో గిరిజనుల కోసం కొత్త డిఆర్ డిపో ప్రారంభం

On
చిన్న నల్లబల్లిలో గిరిజనుల కోసం కొత్త డిఆర్ డిపో ప్రారంభం

13-06-25 భద్రాచలం నియోజకవర్గం.

భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్ముగూడెం మండలంలో గల చిన్న నల్లబల్లి గ్రామంలో గిరిజన ప్రాథమిక సహకార మార్కెటింగ్ సంఘం ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన డిఆర్ డిపో ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన భద్రాచలం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు రిబ్బన్ కట్ చేసి డిపోను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, “ఇది మారుమూల గిరిజన ప్రాంతమైన చిన్న నల్లబల్లిలో ప్రజలకు నిత్యవసరాలు అందుబాటులో ఉండేలా ఈ డిపో ఏర్పాటు చేయడం జరిగింది. స్థానికులు దీన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధిపొందాలి,” అని అన్నారు.

ఈ ప్రారంభోత్సవ వేడుకలో మార్కెట్ కమిటీ చైర్మన్ తెల్లం సీతమ్మ, మండల అధికారులు, నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు, యువత, కాంగ్రెస్ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest News

ఆ అధికారుల ఫొటోలు ట్యాంక్ బండ్ మీద పెట్టండి.. హైకోర్టు ఆ అధికారుల ఫొటోలు ట్యాంక్ బండ్ మీద పెట్టండి.. హైకోర్టు
హైదరాబాద్: అక్రమ నిర్మాణాలపై అధికారుల తీరు పట్ల తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు  చేసింది. అక్రమ నిర్మాణాల పట్ల చర్యలు తీసుకోని అధికారుల ఫోటోలను ట్యాంక్ బండ్‌పై...
విద్యావ్యవస్థపై మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
పక్కా ప్లాన్ ప్రకారమే చేశా.. యాంకర్ స్వేచ్ఛ కేసులో పూర్ణ స్టేట్మెంట్.
డ్రగ్స్ దందాలో నయా ట్రెండ్.. ఇంపోర్టు టు ఎక్స్ పోర్ట్..
ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఆయనే.. అధిష్టానం సంచలన నిర్ణయం
ట్రూ పాయింట్ న్యూస్ కి స్పందన.. సున్నం చెరువులో అక్రమ బోర్ల ధ్వంసం
పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ ప్రమాదం