చిన్న నల్లబల్లిలో గిరిజనుల కోసం కొత్త డిఆర్ డిపో ప్రారంభం
By MAHESH ARN
On
13-06-25 భద్రాచలం నియోజకవర్గం.
భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్ముగూడెం మండలంలో గల చిన్న నల్లబల్లి గ్రామంలో గిరిజన ప్రాథమిక సహకార మార్కెటింగ్ సంఘం ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన డిఆర్ డిపో ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన భద్రాచలం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు రిబ్బన్ కట్ చేసి డిపోను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, “ఇది మారుమూల గిరిజన ప్రాంతమైన చిన్న నల్లబల్లిలో ప్రజలకు నిత్యవసరాలు అందుబాటులో ఉండేలా ఈ డిపో ఏర్పాటు చేయడం జరిగింది. స్థానికులు దీన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధిపొందాలి,” అని అన్నారు.
ఈ ప్రారంభోత్సవ వేడుకలో మార్కెట్ కమిటీ చైర్మన్ తెల్లం సీతమ్మ, మండల అధికారులు, నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు, యువత, కాంగ్రెస్ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Latest News
01 Jul 2025 14:18:09
హైదరాబాద్: అక్రమ నిర్మాణాలపై అధికారుల తీరు పట్ల తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అక్రమ నిర్మాణాల పట్ల చర్యలు తీసుకోని అధికారుల ఫోటోలను ట్యాంక్ బండ్పై...