మా కాలనీ రోడ్డును కబ్జా చేశారు కాపాడండి.. హైడ్రాకు విజయలక్ష్మి కాలనీ వాసుల వినతి
By Ravi
On
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం
బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాదర్ గుల్ లోని విజయలక్ష్మి కాలనీ రోడ్ ను కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డును కబ్జా చేసి నిర్మాణాలు చేపడితే వర్షం నీరు, డ్రైనేజీ ఎలా పోతుందని ప్రశ్నించారు. గతంలో కనెక్టివిటీ రోడ్డుగా చూపెట్టి నేడు ఫ్లాటుగా నిర్మాణాలు చేపట్టడంపై మండిపడ్డారు. రోడ్డును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు కడుతున్నారని గతంలో మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా తమ సమస్య మాత్రం పరిష్కారం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా రోడ్డును కబ్జా చేసి కడుతున్న నిర్మాణాన్ని తీసివేయాలని బడంగ్పేట్ మున్సిపల్, హైడ్రా అధికారులను కోరారు. వర్షం నీరు, డ్రైనేజీ కిందకు పోకపోతే కాలనీ చెరువుల మారిపోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
Tags:
Latest News

28 Jul 2025 09:33:51
సూళ్లూరుపేట నియోజకవర్గం ట్రూపాయింట్ న్యూస్ రిపోర్టర్ ప్రజాప్రతినిధులు,అధికారుల సమిష్టి కృషితోనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని నాయుడుపేట ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి అన్నారు.ఆదివారం నాయుడుపేట ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన మండల...