నిషా నషాలానికి ఎక్కి.. పార్కింగ్ చేసిన వాహనాలపై చూపించాడు
By V KRISHNA
On
కుత్బుల్లాపూర్: జీడిమెట్ల పిఎస్ పరిధిలోని మార్కండేయ నగర్ లో ఓ తాగుబోతు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో అర్ధరాత్రి పార్క్ చేసిన వాహనాలపై పెట్రోల్ పోసి అంజన్ గౌడ్(42) అనే వ్యక్తి నిప్పంటించాడు. 2కార్లు, ఓ ఆటో, 3 బైక్ లు దగ్ధమయ్యాయి. ఈ మధ్యకాలంలో రాత్రి అయిందంటే చాలు తాగుబోతుల హల్చల్ ఎక్కువ అయిపోతుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భాదితుల ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Latest News
22 Jul 2025 18:49:58
హైదరాబాద్: వనస్థలిపురంలో విషాదం అలుముకుంది. బోనాల పండుగకు తెచ్చుకున్న మాంసం తిని ఓ కుటుంబ సభ్యులు ఆసుపత్రిపాలైనారు. వనస్థలిపురం ఆర్టీసీ కాలనీలో నివాసం వుండే శ్రీనివాస్ ఇంట్లో...