అఖిలపక్ష మీటింగ్ కు హాజరు కాకపోవడం పై బీజేపీ, బీఆర్ఎస్ లపై మండిపడ్డ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలపై అఖిలపక్షం పెట్టాలని బిజెపి ,బీఆర్ఎస్ లు అన్నాయి.
ఈరోజు ఎంపీల మీటింగు కూడా అఖిలపక్షం లాంటిదే.
కేంద్ర ప్రభుత్వం సహకారం కోసం ఎట్లా వ్యవహరించాలని సొల్యూషన్ కోసం ఎంపీల మీటింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది బిజెపి, బిఆరెస్ హాజరుకాలేదు.
ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వం పట్ల బిజెపికి బీఆర్ఎస్ కు చిత్తశుద్ధి లేదు.
మోడీ డైరెక్షన్ లో నడిచే స్థాయికి బీఆర్ఎస్ దిగజారిపోయింది.
కేసీఆర్ ప్రతిపక్ష పాత్ర వదిలేసి ఔట్ సోర్సింగ్ లో అల్లునికి, కొడుకుకి ఇచ్చిండు.
రెండు పార్టీల డ్రామాలు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు.
సమావేశాన్ని ఎందుకు బైకాట్ చేశారో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి.
Bjp, Brs పార్టీలకు ఓట్లు తప్ప ప్రజా సమస్యలు పట్టవు.
Bjp వేసే డ్రామాను brs వేస్తుంది.
తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా చర్చ కు రావడంతో బిఆర్ఎస్ కు ,బిజెపి కి మింగుడు పడటం లేదు.
ఒకడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండదని అంటడు.
ఇంకొకడు ఎమ్మెల్యేలు ఉండరని అంటడు.
రెండు పార్టీల నాయకులు జలసితో రాజకీయ కుట్రలు చేస్తున్నారు.
గత ప్రభుత్వం లోని రావాల్సిన బిల్లుల కోసం కాంట్రాక్టర్ల తో ధర్నాలు చేయిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం దగ్గరకు పాజిటివ్ గా పోవాలని సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు.
రాష్ట్రంలో అధికార పక్షం, ప్రతిపక్షాలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది.