ఫణిగిరికాలనీలోని మూసీనదిలో మొసలి..
By V KRISHNA
On
హైదరాబాద్:- ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్ ఫణగిరికాలనీ ఆనుకొని ఉన్న మూసినది ఒడ్డున ఉన్న శివాలయం వద్ద ముసలి కలకలం రేగింది. మూసినది ఒడ్డున సంచరించే నాలుగు కుక్కల్ని నీళ్లలోకి ఈడ్చికేల్లిందని, భయాందోళనగురైన స్థానికులు చైతన్యపురి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న స్థానిక మాజీ కార్పొరేటర్ జిన్నారం విట్టల్ రెడ్డి ఫారెస్ట్ అధికారులతో ఫోన్లో మాట్లాడి విషయం తెలియజేశాడు. గత మూడు రోజుల నుండి ముసలి ఇక్కడే సంచరిస్తుందని సంబంధిత అధికారులకు తెలిపిన ఎవరూ పట్టించుకోవడంలేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.
తక్షణమే మూసి పరివాహక ప్రాంతాల్లో సంచరిస్తున్న ముసళ్లను కట్టడి చేసే విధంగా ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక నాయకులు కాలనీవాసులు కోరారు.
Related Posts
Latest News
30 Jul 2025 09:56:49
పనుల్లో నిమగ్నమైన శామీర్పేట కళాకారులు..
గత ఏడాది అరుణాచలం..ఈ ఏడాది స్వర్ణగిరి..
ప్రతియేటా కొత్త తరహా ఏర్పాట్లతో ఆకట్టుకుంటున్న గణేష్..