పిల్లర్ నీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

By Ravi
On
పిల్లర్ నీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

ఉప్పల్ భగాయత్ లో కలకలం రేగింది. నిన్న అదృశ్యమైన ఇద్దరు పిల్లలు భవన నిర్మాణం కోసం తీసిన పిల్లర్ గుంతలో పడి మృతి చెందారు. సుజాత, వెంకటేష్ దంపతులకు ముగ్గురు సంతానం. ఒక కూతురు, ఇద్దరు కుమారులు. జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన వీరు ఉప్పల్ కుర్మానగర్ ఫ్లై ఓవర్ పనుల్లో కార్మికులుగా పని చేస్తున్నారు. వీరి పిల్లలు మణికంఠ, అర్జున్ ఆడుకుంటూ మంగళవారం కనిపించకుండా పోయారు. వారి కోసం గాలించిన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఉదయం భగాయత్ లో కుల సంఘాల భవనానికి కేటాయించిన భూమిలో భవన నిర్మాణం కోసం పిల్లర్ గుంతలో పడినట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన డిఆర్ఎఫ్ బృందాలు అర్జున్ డెడ్ బాడీనీ బయటకు తీశారు. మణికంఠ కోసం గాలిస్తున్నారు. పోలీసులు ఇది ప్రమాదమా లేక ఎవరైనా చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Tags:

Advertisement

Latest News

అల్వాల్ ట్రాఫిక్ సీఐ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం అల్వాల్ ట్రాఫిక్ సీఐ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
కుత్బుల్లాపూర్, జూలై 24. పెట్ బషీరాబాద్ లోని అల్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో సీఐ నాగరాజు ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సోలిస్...
సంకల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దూలపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బూట్లు పంపిణీ
దయచేసి ఎవ్వరికి షేక్ హ్యాండ్ ఇవ్వకండి..
ఒరిస్సా టు హైదరాబాద్ గంజాయి రవాణా.. ఇద్దరి అరెస్ట్..
సినీనటుడు రాజీవ్ కనకాలకు నోటీసులు ఇచ్చిన పోలీసులు..
ప్రేమ పేరుతో యువతికి వేధింపులు.. నిందితుడి అరెస్ట్
 ఘనంగా మ‌హాల‌క్ష్మి- మ‌హిళ‌ల  ప్ర‌యాణ వేడుక‌లు..