జనాభా గణనకు కేంద్రం నోటిఫికేషన్

On
జనాభా గణనకు కేంద్రం నోటిఫికేషన్

దేశవ్యాప్తంగా జనాభా గణన చేపట్టేందుకు కేంద్రం సిద్దమవుతోంది. ఇప్పటికే తీసుకున్న కేబినెట్ నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా జన గణనలోనే భాగంగా కుల గణన కూడా చేపట్టనున్నారు. దేశంలో రెండు విడతలుగా ఈ జనాభా గణన ప్రక్రియ చేపట్టబోతున్నారు. వచ్చే ఏడాది కొన్ని రాష్ట్రాల్లో జన గణన మొదలు కానుండగా.. మిగతా రాష్ట్రాల్లో 2027లో ఈ ప్రక్రియ చేపట్టబోతున్నారు. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. దేశంలో చేపట్టే జనగణన ముందుగా వచ్చే ఏడాది అక్టోబర్ 1 అర్ధరాత్రి నుంచి కేంద్ర పాలిత ప్రాంతాలైన లడఖ్, జమ్మూ కాశ్మీర్ తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో చేపడతారు. అలాగే 2027 మార్చి 1 నుంచి మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టబోతున్నారు. అలాగే ప్రతీ రాష్ట్రంలోనూ రెండు దశల్లో జనాభా గణన చేపడతారు. నిన్న జనగణన కమిషనర్, రిజిస్ట్రార్ జనరల్ తో ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ఇందులో ఈ తేదీల్ని ఖరారు చేశారు.

Advertisement

Latest News