జననాయగన్‌ తమిళనాడు థియేట్రీకల్ రైట్స్..

By Ravi
On
జననాయగన్‌ తమిళనాడు థియేట్రీకల్ రైట్స్..

దళపతి విజయ్ త్వరలో పూర్తీ స్థాయి పోలిటికల్ ఎంట్రీ ఇవ్వ్వబోతున్నాడు. ఈ నేపధ్యంలో తన సినీ కెరీర్ లో తన లాస్ట్ మూవీ జన నాయగన్‌ లో నటిస్తున్నాడు విజయ్. ఈ సినిమాకు వినోద్ దర్శకత్వం వహిస్తుస్తుండగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మలయాళ నటి మమిత బైజు కీ రోల్ లో కనిపిస్తోంది. అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటించబోతున్నాడు. కాగా ఈ సినిమా రైట్స్ కు భారీ పోటీ నెలకొంది. ఇప్పటికే జన నాయగన్‌ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ రూ. 121 కోట్లకు కొనుగోలు చేసినట్టు టాక్. అలాగే ఈ సినిమా ఆడియో రైట్స్ ను టీ సిరిస్ కొనుగోలు చేసింది. 

ఇక ఈ సినిమా శాటిలైట్ హక్కులను కోలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ కు చెందిన సన్ నెట్ వర్క్ రూ. 55 కోట్లకు దక్కించుకుంది. అలాగే తమిళనాడు థియేట్రికల్ రైట్స్ కోసం తీవ్ర పోటీ నెలకొనగా రొమోయో పిచర్స్ రాహుల్ దాదాపు రూ. 90 కోట్లకు కొనుగోలు చేసారు. విజయ్ చివరి సినిమా కావడంతో జన నాయగన్‌ రైట్స్ కోసం ఇంత డిమాండ్ ఏర్పడిందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. కోలీవుడ్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్ పై నిర్మిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

Advertisement

Latest News

దయచేసి ఎవ్వరికి షేక్ హ్యాండ్ ఇవ్వకండి.. దయచేసి ఎవ్వరికి షేక్ హ్యాండ్ ఇవ్వకండి..
చుట్టుపక్కల ప్రాంతాల్లో నీరు నిల్వకుండా జాగ్రత్తలు పాటించాలని సూచనదోమలు రాకుండా తలుపులు, కిటికీలను తెరలతో కప్పివేయాలన్న వైద్య ఆరోగ్య శాఖవడకాచిన నీటిని మాత్రమే తాగాలన్న వైద్య ఆరోగ్య...
ఒరిస్సా టు హైదరాబాద్ గంజాయి రవాణా.. ఇద్దరి అరెస్ట్..
సినీనటుడు రాజీవ్ కనకాలకు నోటీసులు ఇచ్చిన పోలీసులు..
ప్రేమ పేరుతో యువతికి వేధింపులు.. నిందితుడి అరెస్ట్
 ఘనంగా మ‌హాల‌క్ష్మి- మ‌హిళ‌ల  ప్ర‌యాణ వేడుక‌లు..
మత్తుతో వ్యాపారం.. కోట్లు కొల్లగొట్టిన వైనం..
మరోసారి రికార్డ్ బద్దలు కొట్టిన సైబరాబాద్ పోలీసులు