మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ..

On
మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ..

  • ఇప్పటి వరకు ఆర్టీసీ లో 200 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం..
    మహిళలు ఉచిత ప్రయాణ విలువ  రూ.6700 కోట్లు..
    200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం.. 
    రాష్ట్ర వ్యాప్తంగా 97 ఆర్టీసీ డిపో లు ,341 బస్ స్టేషన్ లలో సంబరాలు..

telangana-free-bus-for-womanBy. V. Krishna kumar
Tpn: స్పెషల్ డెస్క్..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రజా పాలన ప్రభుత్వం లో అమలు చేసిన మొట్టమొదటి మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 9 డిసెంబర్ 2023 నుండి విజయవంతంగా అమలవుతోంది. ఆర్టీసీలో ఇప్పటి వరకు 200 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. 6700 కోట్ల రూపాయల విలువైన ప్రయాణాన్ని మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు.తెలంగాణ ఆర్టీసీకి మహిళా ప్రయాణికుల  రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లిస్తుంది.
 ఆర్టీసీ లో ఎలాంటి ఆటంకాలు లేకుండా నూతన బస్సుల కొనుగోలు చేస్తూ మహా లక్ష్మి పథకం విజయవంతం కోసం కృషి చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు ,కండక్టర్ లు , శ్రామిక్ లు ,ఇతర సిబ్బంది అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ,ప్రయాణికుల భద్రత ,ఉద్యోగుల సంక్షేమం ప్రథమ కర్తవ్యంగా ముందుకు పోతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఉచిత ప్రయాణం ద్వారా ద్వారా మహిళా సాధికారత దిశగా అడుగులు పడుతున్నాయని దూరపు ప్రాంత ప్రజలు కూడా నిత్యం నగరానికి వచ్చి ఉద్యోగాలు చేస్తూ ఆర్టీసీ వృద్ధి సాధించడం అభినందనీయం అని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రతి మహిళా నెలకు 4-5 వేల రూపాయల వరకు ఉచిత ప్రయాణం ద్వారా ఆదా చేసుకుంటున్నారు.
ఆర్టీసీ లో 200 కోట్ల ఉచిత బస్సు ప్రయాణం పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా 97 బస్సు డిపో లు ,341 బస్ స్టేషన్ రేపు జరిగే కార్యక్రమాలు బస్ స్టేషన్లు, డిపోలు మొదలైన వాటిలో బ్యానర్ల ప్రదర్శన చేయాలి.
అన్ని డిపోలలో మరియు ముఖ్యమైన బస్ స్టేషన్లలో సమావేశాలు నిర్వహించబడతాయి. ఈ సంబరాల కార్యక్రమాల్లో స్థానిక ఎంపీలు/మంత్రులు/ఎమ్మెల్యేలు/మేయర్లు/వీఐపీలను సమావేశానికి ఆహ్వానించాలి. మహిళా ప్రయాణీకుల/ప్రయాణికుల ప్రసంగాలను ఏర్పాటు చేయడం కూరగాయల విక్రేతలు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పాఠశాల/కళాశాల విద్యార్థులు, వ్యాపార మహిళలు, పట్టణ ఆసుపత్రులకు మెరుగైన చికిత్స కోసం వెళ్లే మహిళలు, యాత్రికులు వంటి వివిధ వర్గాలకు చెందిన వారు తమ ప్రసంగాలలో తమ ప్రయాణ అనుభవాలను పంచుకోవాలి. డిపోలు మరియు ముఖ్యమైన బస్ స్టేషన్లలో మహిళా ప్రయాణికులను శాలువా మరియు బహుమతితో సత్కరించనున్నారు.మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం, మహిళా సాధికారత మొదలైన అంశాలపై పాఠశాల మరియు కళాశాల విద్యార్థులకు వ్యాస రచన / రంగోలి / చిత్రలేఖనం నిర్వహించాలి. పుస్తకాలు, వాటర్ బాటిళ్లు, పెన్ సెట్లు మొదలైన బహుమతులతో 5 మంది బహుమతి గ్రహీతలను సత్కరించాలి. ఈ పథకం విజయవంతానికి దోహదపడిన ప్రతి డిపోలోని 5 మంది ఉత్తమ డ్రైవర్లు & 5 మంది ఉత్తమ కండక్టర్లతో పాటు ట్రాఫిక్ గైడ్‌లు/భద్రతా సిబ్బందిని సత్కరించాలని డిసైడ్ అయ్యారు.

Advertisement

Latest News

 పండుగ రోజున మిగిలిన నాన్ వెజ్ తిని ఒకరు మృతి..7గురు సీరియస్ పండుగ రోజున మిగిలిన నాన్ వెజ్ తిని ఒకరు మృతి..7గురు సీరియస్
హైదరాబాద్: వనస్థలిపురంలో విషాదం అలుముకుంది. బోనాల పండుగకు తెచ్చుకున్న మాంసం తిని ఓ కుటుంబ సభ్యులు ఆసుపత్రిపాలైనారు. వనస్థలిపురం ఆర్టీసీ కాలనీలో నివాసం వుండే శ్రీనివాస్ ఇంట్లో...
మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ..
భర్త పుట్టినరోజుకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన భార్య..
జుపే గేమ్ యాజమాన్యంపై కేసు నమోదు
అమ్మ వారికి బోనం సమర్పించిన బండ్లగూడ తహసిల్దార్ ప్రవీణ్ కుమార్
నిషా నషాలానికి ఎక్కి.. పార్కింగ్ చేసిన వాహనాలపై చూపించాడు
ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన బొంగునూరి కిషోర్ రెడ్డి