పాకిస్తాన్ లో ఉగ్రవాద స్థావరం నుంచి మృతదేహాలు వెలికితీత

By Ravi
On
పాకిస్తాన్ లో ఉగ్రవాద స్థావరం నుంచి మృతదేహాలు వెలికితీత

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ ప్రతీకారం తీర్చుకున్న సంగతి తెలిసిందే. భారత భద్రతా దళాలు ఆపరేషన్ సింధూర్ నిర్వహించాయి. వైమానిక దాడి తర్వాత, ముజఫరాబాద్‌ లోని హఫీజ్ లష్కర్ ఉగ్రవాద స్థావరంలో భయాందోళనలు నెలకున్నాయి. అక్కడి నుంచి మృతదేహాలను వెలికి తీస్తున్నారు. ఉగ్రవాదంపై భారతదేశం జరిపిన సైనిక చర్యలో పాకిస్తాన్ ఉగ్రవాది మసూద్ అజార్ కుటుంబం నాశనమైంది. భారత వైమానిక దాడిలో, జైషే మహ్మద్ ఉగ్రవాది అజార్ కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు మరణించగా, నలుగురు అనుచరులు కూడా మరణించారు. 

పాకిస్తాన్‌ లోని బహవల్‌పూర్‌ లో భారతదేశం జరిపిన వైమానిక దాడిలో అజార్ కుటుంబం మట్టుబెట్టబడింది. ఈ దాడిలో మౌలానా మసూద్ అజార్ అక్క, మౌలానా కషాఫ్ కుటుంబం మొత్తం, ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ మనవరాళ్ళు మరణించారని, అనేక మంది కుటుంబ సభ్యులు గాయపడ్డారని ఉగ్రవాద సంస్థ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. వైమానిక దాడిలో మరణించిన అజార్ కుటుంబ సభ్యులు, సన్నిహితుల అంత్యక్రియలు ఈరోజు నిర్వహించనున్నారు. కాగా ఈ ఘటనపై పాకిస్తాన్ ఆర్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Latest News

పాశమైలారం మృతులకు కోటి రూపాయల నష్ట పరిహారం.. సీఎం పాశమైలారం మృతులకు కోటి రూపాయల నష్ట పరిహారం.. సీఎం
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో గానీ తెలంగాణ రాష్ట్రంలో గానీ ఇంత భారీ ప్రమాదం జరగలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఈరోజు (మంగళవారం)...
భూదాన్ భూముల్లో ప్రహరీ నిర్మాణం.. కోర్టులో దిక్కరణ పిటిషన్ దాఖలు
యాంకర్ స్వేచ్ఛ కు జర్నలిస్టుల ఘన నివాళి 
ఆ పసివాడిది గట్టి గుండె..! అమ్మ కోసం ఏం చేశాడంటే..!
ఆ అధికారుల ఫొటోలు ట్యాంక్ బండ్ మీద పెట్టండి.. హైకోర్టు
విద్యావ్యవస్థపై మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
పక్కా ప్లాన్ ప్రకారమే చేశా.. యాంకర్ స్వేచ్ఛ కేసులో పూర్ణ స్టేట్మెంట్.