పలుచోట్ల ఎక్సైజ్ దాడి.. గంజాయి, డ్రగ్స్ స్వాదీనం

By Ravi
On
పలుచోట్ల ఎక్సైజ్ దాడి.. గంజాయి, డ్రగ్స్ స్వాదీనం

ఇంటిరీయల్‌ పనుల్లో నైపుణ్యత కలిగిన వృత్తి కళాకారుడు. వృత్తితో పాటు ప్రవృత్తిగా గంజాయి, డ్రగ్స్‌ అమ్మకాలు చేపడుతూ రూ. రెండున్నర లక్షల బైక్‌, రూ. లక్షన్నర సెల్‌తో గంజాయి, డ్రగ్స్‌ అమ్మకాలు సాగిస్తూ సొమ్ము చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఎస్ టి ఎఫ్  బి టీమ్‌ ఎస్సై  బాలరాజు సిబ్బంది కలిసి కుత్భుల్లాపూర్‌ శివారెడ్డి నగర్‌లో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో షరీఫ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడి  వద్ద 1.360 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.  రూ. లక్షల విలువ చేసే బైక్‌ను, సెల్‌ ఫోన్ ను, గంజాయిని  ఎక్సైజ్‌ స్టేషన్‌లో అప్పగించామని ఎస్సై బాలరాజు తెలిపారు. ఇదే  కేసులో అఖిల్‌ అనే వ్యక్తిపై కూడ కేసు నమోదు చేశారు.

మరో కేసులో...

గొల్కోండ టీఎస్‌ఎస్‌ పీడీసీఎల్‌ మారుతి లంగర్‌ హౌజ్‌   ప్రాంతంలో హెచ్ డి ఎఫ్ బి టీమ్‌ నిర్వహించిన దాడుల్లో 5  గ్రాముల ఎండిఎంఎ డ్రగ్స్‌ను పట్టుబడింది. డ్రగ్స్‌ అమ్మకాలు జరుపుతున్న మహ్మమద్‌ సులేమాన్‌ ను అతడి వద్ద ఉన్న రెండు సెల్‌ ఫోన్ , ఒక బైక్‌ను  స్వాధీనం చేసుకున్నట్లు టీమ్‌ లీడర్‌ అంజి రెడ్డి తెలిపారు. ఈ కేసులో బెంగూళూరుకు చెందిన షకీల్‌పై కూడ  కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.  నిందితుడిని, డ్రగ్స్‌ను గోల్కోండ ఎక్సైజ్‌ స్టేషన్‌లో అప్పగించామని తెలిపారు.IMG-20250505-WA0139

Tags:

Advertisement

Latest News

ఇది విన్నారా.. ఈ బంపర్ ఆఫర్ మీ కోసమే.. ఇది విన్నారా.. ఈ బంపర్ ఆఫర్ మీ కోసమే..
భారత్ గౌరవ్ పేరుతో పర్యాటక టూర్ స్టార్ట్ చేసిన రైల్వే..తక్కువ ధరకు జ్యోతిర్లింగాల దర్శనం..స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అన్ని వారే చూసుకుంటారు..
ఇక అదిరిపోనున్న హైదరాబాద్..
సంపూర్ణ రియల్ మార్గదర్శి ఈ పుస్తకం
ఇక తాగే వాళ్లకు.. తాగినంత బీర్లు..
అస్తవ్యస్తం..అవినీతి మయం..దిగజారిపోతున్న నిమ్స్ వైభోగం
స్వర్ణగిరి నమునాతో ఈ ఏడాది బాలాపూర్ గణేష్..
ఫణిగిరికాలనీలోని మూసీనదిలో మొసలి..