హైవేలపై ఇక అంతా అదే చూసుకుంటుంది..

On
హైవేలపై ఇక అంతా అదే చూసుకుంటుంది..

  • నేషనల్  హైవేలపై ఏఐ టెక్నాలజీ వినియోగం
    హద్దు దాటితే వాహనదారులకు హెచ్చరికలు
    టోల్ గేట్ ల నుండి హైవే మొత్తం  ఏఐతో నిఘా

By. V. Krishna kumarT

pn:  స్పెషల్ డెస్క్..

ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్  (AI) చుట్టే తిరుగుతోంది. చివరికి ఆటోమోటివ్ సెగ్మెంట్ లో సైతం ఏఐ దూసుకొచ్చేసింది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అందుబాటులోకి రావడమే దీనికి నిదర్శనం. ఊహకు కూడా అందని విధంగా డ్రైవరే అక్కర్లేని కార్లు రోడ్ల మీదికి వచ్చేస్తోన్నాయి. ఏఐ. డ్రైవర్ రోల్ ను పోషిస్తోంది. మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఆధారంగా పనిచేసే ఏఐ అల్గోరిథమ్స్ డ్రైవర్ సీటును ఆక్రమిస్తోన్నాయి. మనుషుల ప్రమేయం లేకుండా సెన్సార్ డేటాను అర్థం చేసుకోవడం, వస్తువులను గుర్తించడం, రూట్ ప్లాన్ రూపొందించుకోవడం, సంక్లిష్ట వాతావరణంలో కూడా కారును నావిగేట్ చేయడానికి ఈ అల్గోరిథమ్స్ ఉపయోగపడతాయి. రియల్-టైమ్ సెన్సార్ డేటా ఇందులో కీలకం.
ఇప్పుడు ఇది మరింత విస్తరించింది. జాతీయ రహదారులపై వాహనాల రాకపోకల్లోనూ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అడుగు పెట్టింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏఐ ఆధారిత స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్ ను ద్వారకా ఎక్స్ ప్రెస్ వేపై ప్రవేశపెట్టింది జాతీయ రహదారుల సంస్థ (NHAI).

2023లో ఎన్ హెచ్ఏఐ రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. ద్వారకా ఎక్స్ ప్రెస్ పై  ట్రాఫిక్ నిర్వహణ, రహదారి భద్రతలో ఇదొక విప్లవాత్మకంగా అభివర్ణించింది. వాహనాల రద్దీ క్రమబద్దీకరించడం, ప్రమాదాలను నివారించడంలో ఓ ముందడుగు పడిందని ఎన్ హెచ్ఏఐ పేర్కొంది.

ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ (IHMCL) ఈ ఏఐ ఆధారిత ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ద్వారకా ఎక్స్ ప్రెస్ వేపై తొలిదశలో మొత్తం 56.46 కిలోమీటర్ల వరకు మేర ఇది కవర్ అవుతుంది. క్రమంగా మిగిలిన జాతీయ రహదారులకు దీన్ని విస్తరించే అవకాశం ఉంది.
రియల్ టైమ్ డేటా, ఆటోమేటెడ్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ప్రమాదాలను తగ్గించి, వాహనాల రాకపోకలను మరింత మెరుగుపరిచే సామర్థ్యం ఈ టెక్నాలజీకి ఉందని ఎన్ హెచ్ఏఐ తెలిపింది. రోడ్డు ప్రమాదాలను సగానికి పైగా తగ్గించడానికి కేరళ ప్రభుత్వం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలను ఉపయోగించచడానికి చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇదే తరహాలో ఢిల్లీ ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ITMS) ట్రాఫిక్ ఉల్లంఘనలను పర్యవేక్షించడానికి 3డీ రాడార్ ఆధారిత కెమెరాలను ఉపయోగిస్తోంది. ఇది ప్రజలకు మరింత భద్రత కల్పించడానికి, ప్రమాదాలను నివారించడానికి ఈ అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగపడుతోంది. రాబోయే కొద్దిరోజుల్లో అన్ని హైవేలపై ఏఐ టెక్నాలజీ ఉపయోగించేందుకు అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్నారు.

Advertisement

Latest News

ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఆయనే.. అధిష్టానం సంచలన నిర్ణయం ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఆయనే.. అధిష్టానం సంచలన నిర్ణయం
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ప్రస్తుతం మాధవ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తున్నారు....
ట్రూ పాయింట్ న్యూస్ కి స్పందన.. సున్నం చెరువులో అక్రమ బోర్ల ధ్వంసం
పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ ప్రమాదం
ఆ నీళ్లు మీరు తాగుతున్నారా.. అయితే ఖచ్చితంగా పోతారు..
వివాదానికి దారితీసిన బల్కంపేట దేవాలయ కమిటీ ఏర్పాటు
విదేశీ సిగరేట్ల దిగుమతి.. పోలీసుల దాడి. ఒకరి అరెస్ట్
మహాన్యూస్ పై దాడి కేసులో బిఆర్ఎస్ నేతల అరెస్ట్