ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి

By Ravi
On
ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి

Kukkala Govinda Raju..TPN
Ramachandrapuram

  • రూ.16.53 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం
  • పలు శంకుస్థాపనలు చేసిన కూటమి పార్టీ నాయకులు వాసంశెట్టి సత్యం

రామచంద్రపురం మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో రూ.16.53 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి, కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం,  మున్సిపల్ చైర్ పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, కమిషనర్ నాయుడులు శంకుస్థాపన చేశారు.  15వ ఆర్థిక సంఘం నిధులు, మున్సిపల్ సాధారణ నిధులుతో పలు అభివృద్ధి పనులకు శుక్రవారం శంకుస్థాపనలు చేశారు. 

తొలుత వెల్ల లోని హెడ్ వాటర్ ట్యాంక్ ముఖద్వారం గేటు, ఇతర మరమ్మత్తుల కోసం రూ. 4.99 లక్షలు, రెండవ వార్డ్ స్టిల్ వెల్ పేటలో రూ.5 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణానికి, లలిత నగర్ 16 వార్డులోని సి సి రోడ్డు నిర్మాణానికి రూ.3.30 లక్షలు, అలాగే శాంతినగర్ 9వ వార్డులో సీసీ డ్రైయిన్ నిర్మాణానికి రూ.3.24 లక్షలు వెచ్చించి అభివృద్ధి పనులుకు శంకుస్థాపన గావించారు . 

ఈ సందర్భంగా కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ పట్టణాలు, గ్రామాల్లో ప్రజల మౌలిక సదుపాయాలు కల్పన దిశగా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. త్రాగునీరు, సిసి రోడ్ల నిర్మాణం, డ్రైన్స్ నిర్మాణం వంటి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం తగినన్ని నిధులు మంజూరు చేసిందన్నారు.  ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చ క్రమంలో కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తుందన్నారు.

అభివృద్ధి,సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా పనిచేస్తుందన్నారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్ డి.ఇ శ్రీకాంత్, ఎ.ఈ లు, కూటమి పార్టీ నాయకులు, ఆయా వార్డుల కౌన్సిలర్లు, ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

భారీ వర్షాల ఎఫెక్ట్: పురాతన భవనాన్ని కూల్చివేసిన అధికారులు.. భారీ వర్షాల ఎఫెక్ట్: పురాతన భవనాన్ని కూల్చివేసిన అధికారులు..
హైదరాబాద్: సికింద్రాబాద్.. రాంగోపాల్ పేట.. మెక్లవుడ్ గూడలో శిధిలావస్థకు చేరుకున్న ఒక పురాతన భవనాన్ని జిహెచ్ఎంసి అధికారులు పోలీసుల సహాయంతో కూల్చివేశారు. అయితే ఈ భవనంలో గత...
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద భారీ బందోబస్తు
శ్రీ చైతన్య కళాశాల ఇంచార్జ్ పై కేసు నమోదు..
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో ఇద్దరు డిఎస్పీల మృతి..
హరిహారవీరమల్లు సినిమా సక్సెస్.. అమ్మవారికి ప్రత్యేక పూజలు
అల్వాల్ ట్రాఫిక్ సీఐ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
సంకల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దూలపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బూట్లు పంపిణీ