మావోయిస్ట్ అంటూ లేఖరాశారు.. సిసి కెమెరాలకు చిక్కారు..
By Ravi
On
జీడిమెట్ల పిఎస్ పరిదిలో మావోయిస్టుల పేరుతో లేఖరాసి సంచలనం సృష్టించిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. భాదితుడు కూన రాఘవేంద్ర గౌడ్ ఇంట్లోనే అద్దెకుఉంటున్న ఎర్రం శెట్టి రాజు (33)అతని స్నేహితుడు కందురెళ్లి రాజు (24)గా గుర్తించారు. ఇద్దరు నిందుతులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి13 చిన్న పాటి నాటు బాంబులు, 3 సెల్ ఫోన్ లు , 2 బెదిరింపు లేఖలు స్వాదీనం చేసుకున్నారు. నాటు బాంబులను విజయనగరంలో కొనుగోలు చేసినట్లు జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలనగర్ ఏసీపీ నరేష్ రెడ్డి వివరించారు. రూ. 50లక్షలు ఇవ్వకపోతే చంపేస్తామంటూ నిందితులు హెచ్చరించారని, సిసి ఫుటేజ్ ద్వారా వారిని గుర్తించడం జరిగిందన్నారు.
Latest News
26 Jul 2025 10:29:52
హైదరాబాద్: సికింద్రాబాద్.. రాంగోపాల్ పేట.. మెక్లవుడ్ గూడలో శిధిలావస్థకు చేరుకున్న ఒక పురాతన భవనాన్ని జిహెచ్ఎంసి అధికారులు పోలీసుల సహాయంతో కూల్చివేశారు. అయితే ఈ భవనంలో గత...