ట్రూ పాయింట్ న్యూస్ కి స్పందన.. అసభ్యకరమైన బొమ్మ తొలగింపు
By V KRISHNA
On
హైదరాబాద్: ట్రూ పాయింట్ న్యూస్ కి స్పందన లభించింది. జూబ్లీహిల్స్ డైమండ్ హౌస్ వద్ద ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త ఏర్పాటు చేసిన అసభ్యకరమైన బొమ్మను తొలగించారు. నడిరోడ్డుపై తన ప్రహరీగోడను ఆనుకొని ఏర్పాటు చేసిన బొమ్మపై ట్రూ పాయింట్ న్యూస్ లో ఇదేందిరా నాయనా దిక్కుమాలిన పని.. ఇంటి ముందు అలాంటి బొమ్మ అంటూ వార్త ప్రచురించడం జరిగింది. పాయింట్ న్యూస్ లో వచ్చిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడం పోలీస్ ఉన్నతాధికారులు సదరు వ్యాపారవేత్తపై సీరియస్ అయినట్లు సమాచారం. వెంటనే అభ్యంతరకరంగా ఉన్న బొమ్మను తొలగించక పోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడంతో హడావిడిగా సెక్యూరిటీ సిబ్బందిని పిలిచి ఆ బొమ్మను తొలగించారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా బొమ్మలే కాదు, పోస్టర్లు, కామెంట్లు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Latest News
08 Jul 2025 20:45:53
* ప్రసన్న కుమార్ రెడ్డిపై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఫిర్యాదు* రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు సరికాదు : మంత్రి సవిత* నల్లపురెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్...