తెలుగు స్విమ్మర్లకు అవార్డులు..

By Ravi
On
తెలుగు స్విమ్మర్లకు అవార్డులు..

ప్రస్తుతం బీహార్ వేదికగా ఖేలో ఇండియా యువజన క్రీడల్లో తెలుగు స్విమ్మర్లు పతకాల పంట పండించారు. తెలంగాణకు చెందిన వర్షిత్‌.. బాలుర పోటీలో 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో అవార్డ్ అందుకున్నారు. అలాగే సుహాస్‌ ప్రీతమ్‌ బాలుర పోటీలో 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ లో స్వర్ణ పతకం సాధించారు. శ్రీనిత్య సాగి బాలికల పోటీలో 100 మీ. బ్యాక్‌స్ట్రోక్‌ విభాగంలో విజేతగా నిలిచి రాష్ట్రానికి మూడు స్వర్ణాలు అందించారు. ఇక ఒక కిలోమీటర్‌ సైక్లింగ్‌ ట్రాక్‌ ఈవెంట్‌లో సాయిచరణ్‌ యాదవ్‌ కాంస్యం నెగ్గి తెలంగాణ ఖాతాలో నాలుగో పతకాన్ని చేర్చాడు. 

స్విమ్మింగ్‌ 1500 మీటర్ల ఫ్రీస్టయిల్‌ ఈవెంట్‌ లో ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన సంపత్‌ కుమార్‌ యాదవ్‌, తీర్థు సామదేవ్‌ వరుసగా స్వర్ణ, కాంస్యాలు దక్కించుకున్నారు. ఇక, 400 మీ. వ్యక్తిగత మెడ్లేలోనూ సత్తా చాటుతూ తీర్థు సామదేవ్‌ రజతం గెలిచాడు. ఈ క్రమంలో ఖేలో ఇండియాలో మరిన్ని పోటీలు ప్రభుత్వం నిర్వహిస్తుంది.

Related Posts

Advertisement

Latest News