రసాయన ట్యాంకర్ ను పట్టుకున్న ఎస్ఓటి పోలీసులు..
By Ravi
On

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా రసాయన వ్యర్ధాలను తరలిస్తున్న ట్యాంకర్ సుతారిగూడలో మేడ్చల్ ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. మేడ్చల్ పిఎస్ పరిధిలో అక్రమంగా ప్రమాదకర రసాయన వ్యర్ధాలను తరలిస్తున్న ట్యాంకర్ ను నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్నారు. టీఎస్31 టి1119 నెంబర్ గల ట్యాంకర్ ను తరలిస్తున్న వ్యక్తి దుండిగల్ తాండ 2కి చెందిన సురేష్ పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అనంతరం ట్యాంకర్ ను కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులకు అప్పగించారు. ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చి అర్ధరాత్రి పూట ఎవ్వరు చూడకుండా చెరువులో కలుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Tags: #medchalpolice#
Latest News

18 Aug 2025 07:16:35
ఉప్పల్ పీఎస్ పరిధి రామంతపూర్ గోకుల్ నగర్ లో శ్రీకృష్ణ శోభాయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. శోభాయత్రా ముగింపు దశలో కరెంట్ షాక్ తో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే...