నేడు గుజరాత్ తో రాజస్థాన్ మ్యాచ్..

ఐపీఎల్ 2025 చాలా ఇంట్రెస్టింగ్ గా సాగిపోతోంది. నేడు మరో పోరుకు సర్వం సిద్ధమవుతోంది. ఇవాళ గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ తో పోటీ పడుతుంది. ఐపీఎల్ 2025 లో గుజరాత్ టైటాన్స్ మంచి ఫామ్ లో ఉంది. శుభ్మాన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్లలో 6 మ్యాచ్ల్లో గెలిచి, రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. గుజరాత్ జట్టు 12 పాయింట్లతో కొనసాగుతోంది. గుజరాత్ తన చివరి మ్యాచ్ లో కేకేఆర్ ను 39 పరుగుల తేడాతో ఓడించింది. రాజస్థాన్ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ ల్లో రెండింటిలో మాత్రమే విజయం సాధించింది.
గుజరాత్, రాజస్థాన్ మధ్య మ్యాచ్ జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరుగబోతుంది. సవాయి మాన్సింగ్ స్టేడియం పిచ్ గురించి మాట్లాడుకుంటే.. అది బ్యాట్స్మెన్, బౌలర్లు ఇద్దరికీ అనుకూలంగా ఉంటుంది. ఈ మ్యాచ్ ప్రారంభంలో బౌలర్ల కు అనుకూలం. కానీ ఆట ముందుకు సాగుతున్న కొద్దీ, బ్యాట్స్ మెన్ కు పరుగులు సాధించడంలో సపోర్ట్ చేస్తుంది. బ్యాట్స్ మెన్ ఎక్కువ పరుగులు సాధించడానికి అవకాశం ఉంటుంది.
Related Posts
Latest News
