ఆపరేషన్ చబత్ర.. పోలీసుల అదుపులో 122మంది
By V KRISHNA
On
రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన పరిధిలో పోలీస్ ఆపరేషన్ చబుత్ర నిర్వహించారు. అర్ధరాత్రి రోడ్లపై చక్కర్లు కొడుతున్న సుమారు 122 మందిని అదుపులోకి తీసుకున్నారు. నందనవనం, ఆర్.ఎన్. రెడ్డి నగర్, భూపేష్ గుప్తా నగర్ ప్రాంతంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టుబడిన వారందరిని అదుపులోకి తీసుకొని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. మరోసారి రిపీట్ అయితే జైలుకి పంపుతామని హెచ్చరించారు. అలాగే డ్రగ్స్, రోడ్డుప్రమాదాలు, సైబర్ నేరాల గురించి వివరించారు. కార్యక్రమంలో సిఐతో పాటు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Related Posts
Latest News
30 Jun 2025 15:46:55
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ప్రస్తుతం మాధవ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తున్నారు....