మెట్రో స్టేషన్ నుండి దూకి యువకుడి ఆత్మహత్య
హైదరాబాద్: నీట్ పరీక్షలో క్వాలిఫై కాలేదని మానసికంగా కృంగిపోయిన ఓ యువకుడు మెట్రో స్టేషన్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సిఐ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలోని విశాఖ నగర్ లో నివాసముండే జరిపేటి హర్షిత్ (24)మాదాపూర్ లో ఓ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నాడు. ఉదయం కోచింగ్ కి 6గంటలకు వెళ్లిన తన కుమారుడు ఆత్మహత్యకు ముందు ఫోన్ చేసి మానసికంగా కృంగిపోతున్నానని తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఫోన్ చేసి చెప్పాడని, ఎక్కడున్న విషయం మాత్రం చెప్పలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. దీనితో పోలీసులు ఫోన్ చేసి మీ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు అనే విషయం తెలియజేశారని, అబ్బాయి మృతిపై ఎలాంటి అనుమానం లేదని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.