ఉరివేసుకొని ఓప్రముఖ ఛానల్ న్యూస్ యాంకర్ ఆత్మహత్య

On
ఉరివేసుకొని ఓప్రముఖ ఛానల్ న్యూస్ యాంకర్ ఆత్మహత్య

హైదరాబాద్: కుటుంబ కలహాలతో మన స్థాపానికి గురైన ఓ ఛానల్ లో న్యూస్ యాంకర్ గా పనిచేస్తున్న స్వేచ్ఛ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన చిక్కడపల్లి పీఎస్ పరిధిలో జరిగింది. జవహర్ నగర్ లో శీలం రెసిడెన్సీలో నీ పెంట్ హౌస్ లో తన కూతురు సేన అరణ్యతో కలిసి నివాసం ఉంటుంది. 2014లో భర్త క్రాంతి కిరణ్తో విడాకులు కావడంతో కొన్ని రోజులపాటు రాంనగర్లో తల్లిదండ్రులు శంకర్, తల్లితో కలిసి నివాసం ఉండేది. గత నాలుగు సంవత్సరాల క్రితం ఆమె తన కూతురితో కలిసి ఒంటరిగా జవహర్ నగర్ లోని శీలం రెసిడెన్సిలో పెంట్ హౌస్ లో నివాసం ఉంటున్నారు. నాటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.. దీంతో మనస్థాపానికి గురైన స్వేచ్ఛ అపార్ట్మెంట్లో నీ పెంట్ హౌస్ లో  రాత్రి 8:30 గంటలకు ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చిక్కడపల్లి సిఐ రాజు నాయక్ తెలిపారు. సమాచారం అందుకొని సంఘటన స్థలానికి చేరుకున్న  పోలీసులు వెంటనే క్లూస్ టీం ను రప్పించి వివరాలు సేకరించారు. అనంతరం అమే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Latest News

ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఆయనే.. అధిష్టానం సంచలన నిర్ణయం ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఆయనే.. అధిష్టానం సంచలన నిర్ణయం
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ప్రస్తుతం మాధవ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తున్నారు....
ట్రూ పాయింట్ న్యూస్ కి స్పందన.. సున్నం చెరువులో అక్రమ బోర్ల ధ్వంసం
పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ ప్రమాదం
ఆ నీళ్లు మీరు తాగుతున్నారా.. అయితే ఖచ్చితంగా పోతారు..
వివాదానికి దారితీసిన బల్కంపేట దేవాలయ కమిటీ ఏర్పాటు
విదేశీ సిగరేట్ల దిగుమతి.. పోలీసుల దాడి. ఒకరి అరెస్ట్
మహాన్యూస్ పై దాడి కేసులో బిఆర్ఎస్ నేతల అరెస్ట్