ఆపరేషన్‌ సిందూర్.. ఐపీఎల్‌ పై ఎఫెక్ట్..?

By Ravi
On
ఆపరేషన్‌ సిందూర్.. ఐపీఎల్‌ పై ఎఫెక్ట్..?

పాకిస్థాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. పహల్గాంలో అమాయకులపై దాడి చేసిన పాక్‌ ఉగ్రదాడికి బదులుగానే భారత్ ఆపరేషన్ సిందూర్‌ పేరిట ఉగ్రవాదులపై మండిపడింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పాక్‌ కు చావుదెబ్బ తగిలిందని ప్రపంచవ్యాప్తంగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో ఐపీఎల్‌ నిర్వహణపై ఇప్పుడు పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ కంటిన్యూ అవ్వడంపై డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి.

ఐపీఎల్ 2025 సీజన్‌లో ఇప్పటికే 56 మ్యాచులు ముగిశాయి. లీగ్ స్టేజ్‌లో ఇంకా 14 మ్యాచులు ఉన్నాయి. నాకౌట్‌, ఫైనల్‌ కలిపి ఇంకా నాలుగు మ్యాచులు ఆడాల్సి ఉంది. మే 25న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా ఫైనల్‌ జరగనుంది. ఇప్పుడిప్పుడే ప్లేఆఫ్స్‌ వేడి రాజుకొంది. టాప్‌ 4 కోసం ఏడు జట్లు పోటీలో నిలిచాయి. ఇలాంటి పరిస్థితుల్లో టోర్నీని వాయిదా వేయాలా? రద్దు చేయాలా? అనేది బీసీసీఐ ముందున్న కఠిన నిర్ణయం. అయితే, తమకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సూచనలు రాలేదని బీసీసీఐ ప్రతినిధులు పేర్కొన్నారు.

Advertisement

Latest News

ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి షాక్ ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి షాక్
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై. శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఊహించని పరిణామం ఎదురైంది. ఈ కేసు నుంచి ఆమెను విముక్తురాలిని చేస్తూ...
లోప రహిత క్రమశిక్షణ.. అప్పీల్ కేసుల నిర్వహణపై సదస్సు
నార్సింగిలో విషాదం.. అగ్నిప్రమాదంలో కొరియోగ్రాఫర్ మృతి
55ఏళ్ల తరువాత వార్ సైరన్లు వాడాము.. సీపీ ఆనంద్
జవహర్ నగర్ లో విషాదం.. లిఫ్ట్ తెగిపడి ముగ్గురు మృతి
పేరుకి కార్ల వ్యాపారం.. చేసేది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విక్రయం
అదరగొట్టిన ఆపరేషన్ అభ్యాస్