రూ. 1.26కోట్ల మాదకద్రవ్యాల దహనం..
By Ravi
On
హైదరాబాద్ డివిజన్ పరిధిలోని తొమ్మిది ఎక్సైజ్ స్టేషన్ల గంజాయి, డ్రగ్స్ ని అధికారులు దహనం చేశారు. 102 కేసుల్లో రూ. 1.26 కోట్ల గంజాయి, డ్రగ్స్ పట్టుబడింది.171.34 కేజీల గంజాయి, 21.03 కేజీల గంజాయి చాక్లెట్లు, 20కేజీల కుల్పీ 320.6 గ్రాముల హషీస్ అయిల్, 51గ్రాముల ఓజీ కుష్, 17.66 గ్రాముల ఎండిఎంఎ,12. గ్రాముల కోకైన్లను దాహనం చేశారు. డిస్పోజల్ అధికారిగా హైదరాబాద్ డిప్యూటి కమిషనర్ కే.ఏ.బీ శాస్త్రీ ఇచ్చిన అదేశాల మేరకు ఏఈఎస్లు ఎన్.శ్రీనివాసరావు, ఏ.మోహన్ బాబు, అమీర్పేట్, ధూల్పేట్, గొల్కోండ, జూబ్లీలీ హీల్స్, కాచిగూడ, మలక్పేట్, ముషీరాబాద్, నారాయణగూడ, సికింద్రాబాద్ సీఐ,ఎస్సైలు కలిసి ఎం/ఎస్ జీజేమల్టీకౌవ్ ప్రైవేట్ లిమిటెడ్లో గంజాయి, డ్రగ్స్ను దహనం చేశారు.
Tags:
Latest News
27 Jul 2025 13:05:00
టెస్ట్ ట్యూబ్ బేబీ పేరుతో మోసాలు..భర్తకు బదులు మరొకరి వీర్యంతో జీవితాలు ఆగం చేసిన నిర్వాహకులు..దేశవ్యాప్తంగా బ్రాంచ్ లు..సికింద్రాబాద్ లో వెలుగు చూసిన యూనివర్సల్ మోసాలు..