మధురానగర్‌లో రౌడీమూకల దౌర్జన్యం.. ఫ్టాట్‌ ఖాళీ చేయాలని కుటుంబంపై దాడి..!

By Ravi
On
మధురానగర్‌లో రౌడీమూకల దౌర్జన్యం.. ఫ్టాట్‌ ఖాళీ చేయాలని కుటుంబంపై దాడి..!

హైదరాబాద్‌ TPN : మధురానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీనివాస నగర్‌లోని నాలుగో అంతస్తులో అద్దెకు ఉండే కుటుంబాన్ని కొందరు రౌడీ మూకలు శారీరకంగా దాడి చేసి బలవంతంగా ఫ్లాట్ ఖాళీ చేయాలని బెదిరించారు. కుటుంబానికి ఫ్లాట్‌ను అద్దెకు ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే నిన్న రాత్రి రౌడీ మూకలు బలవంతంగా ఫ్లాట్‌లోకి చొరబడి, అక్కడ నివసిస్తున్న వారిని కొట్టి బయటికి తరిమేయాలని ప్రయత్నించారు. వెంటనే విషయం తెలుసుకున్న ఓనర్, పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల రాకతో రౌడీ మూకలు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Latest News

భారీ వర్షాల ఎఫెక్ట్: పురాతన భవనాన్ని కూల్చివేసిన అధికారులు.. భారీ వర్షాల ఎఫెక్ట్: పురాతన భవనాన్ని కూల్చివేసిన అధికారులు..
హైదరాబాద్: సికింద్రాబాద్.. రాంగోపాల్ పేట.. మెక్లవుడ్ గూడలో శిధిలావస్థకు చేరుకున్న ఒక పురాతన భవనాన్ని జిహెచ్ఎంసి అధికారులు పోలీసుల సహాయంతో కూల్చివేశారు. అయితే ఈ భవనంలో గత...
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద భారీ బందోబస్తు
శ్రీ చైతన్య కళాశాల ఇంచార్జ్ పై కేసు నమోదు..
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో ఇద్దరు డిఎస్పీల మృతి..
హరిహారవీరమల్లు సినిమా సక్సెస్.. అమ్మవారికి ప్రత్యేక పూజలు
అల్వాల్ ట్రాఫిక్ సీఐ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
సంకల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దూలపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బూట్లు పంపిణీ