యూపీ టు హైదరాబాద్ కొరియర్.. అల్ఫాజోలం ట్యాబ్లెట్స్ స్వాధీనం..

By Ravi
On
యూపీ టు హైదరాబాద్ కొరియర్.. అల్ఫాజోలం ట్యాబ్లెట్స్ స్వాధీనం..

హైదరాబాద్: నిషేధిత అల్ఫాజోలం టాబ్లెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు వ్యక్తులు ఉత్తరప్రదేశ్ కాన్పూర్ నుంచి తెప్పించి చాలామందికి ఎక్కువ ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటూ లబ్ధి పొందుతున్నారని ప్రో హిబిషన్ అండ్ ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి పేర్కొన్నారు.  ఎక్సైజ్ భవన్ లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఇద్దరు నిందితులతో పాటు ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి అల్ఫాజోలం టాబ్లెట్లను మీడియా ముందు ప్రదర్శించారు. కల్తీకల్లుకు, మత్తు రావడానికి వినియోగించేటువంటి అల్ఫాజోలం టాబ్లెట్లను ప్రభుత్వం గతంలో నిషేధించిందని ఈ మేరకు కొందరు వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా ట్యాబ్లెట్లను వివిధ రాష్ట్రాల నుంచి తెప్పించి నాలుగు రూపాయలకు ఒక టాబ్లెట్ విలువ ఉన్నటువంటి టాబ్లెట్ ను పది రూపాయల నుంచి 20 రూపాయలకు  అమ్మకాలు జరుపుతూ సొమ్ము చేసుకున్నట్లు ఖురేషి వెల్లడించారు. రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ టీం సుభాష్ చందర్ ఇద్దరు ఎస్ఐలు డ్రగ్ కంట్రోల్ నుండి అసిస్టెంట్ డైరెక్టర్ ప్రసాద్ డ్రగ్ ఇన్స్పెక్టర్లు అనిల్ రెడ్డి గోవింద సింగర్ తో పాటు ఎస్టిఎఫ్ నుంచి సిహెచ్ నాగరాజు, రవి శ్రీనివాస్, సందీప్ రెడ్డి, కిషన్ ఫారుకి సిబ్బంది కలిసి హయత్ నగర్ లోని ఆటో నగర్ లో ఉత్తరప్రదేశ్ నుంచి కొరియర్లో రావడంతో వీరందరూ కలిసి మూకుమ్మడిగా దాడి చేసి టాబ్లెట్లను రికవర్ చేసుకొని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన పువ్వాడ లక్ష్మణ్, కేతుపల్లి మునిశేఖర్ పొద్దుటూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులను టాబ్లెట్లతో సహా అరెస్ట్ చేశారు. పట్టుబడిన ట్యాబ్లెట్స్ విలువ  ఆరు లక్షల 48 వేల విలువ ఉంటుందని అధికారులు అంచనా వేశారు. మీడియా సమావేశంలో అడిషనల్ కమిషనర్ గురించి తో పాటు రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ దశరథ్ అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్ సరూర్నగర్ ఎక్సైజ్ సూపర్డెంట్ ఉజ్వల రెడ్డి, రంగారెడ్డి ఏఎస్ జీవన్ కిరణ్ తో పాటు ఇతర సిబ్బంది ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement

Latest News