దాడులతో దడపుట్టిస్తున్న ఎక్సైజ్ టీమ్స్.. భారీగా డ్రగ్స్ స్వాధీనం.
హైదరాబాద్లోని అమీర్పేట్, కాచిగూడ, కుత్భుల్లాపూర్ ఎక్సైజ్ స్టేషన్ల పరిధు ల్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫొర్స్ టీమ్లు దాడులు నిర్వహించి డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన డ్రగ్స్ విలువ రూ.4.36 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.
విదేశాల నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. ఢిల్లీలో ఐఐఐటిలో చదువుతున్న క్రమంలో కనిష్క్ కెవిన్ అనే యువకుడు డ్రగ్స్కు అలవాటు పడ్డాడు. చదువులో డ్రగ్స్ వినియోగంతో పెయిల్ అవడంతో హైదరాబాద్ కు వచ్చి హోటల్ మేనేజ్మెంట్లో చేరాడు. డ్రగ్స్ అలవాటు పడిన కెవిన్ ఢిల్లీ నుంచి ఎల్ఎస్డి బాస్ట్స్ను దిగుమతి చేసుకొని అమ్మకాలు సాగిస్తూ, తాను సేవిస్తూ ఎస్టి ఎఫ్ఏ టీమ్కు డిడినగర్లో అడ్డంగా చిక్కాడు. ఈ కేసులో కనిష్క్ కెవిన్ వద్ద 113 ఎల్ఎస్డి బాస్ట్స్ను పట్టుకున్నారు. 16 గ్రాముల ఓజీ కుష్ను కూడ స్వాధీనం చేసుకున్నట్లు ఏ టీమ్ లీడర్ నంద్యాల అంజిరెడ్డి తెలిపారు. ఈ కేసులో కెవిన్తో పాటు ఎం దీపక్ కుమార్, మహ్మమద్ సిరాజ్, జెతిన్లపై కూడ కేసు నమోదు చేశామని అంజి రెడ్డి తెలిపారు. నిందితుడిని డ్రగ్స్ను కాచిగూడ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు.
మరో కేసులో కుత్భుల్లాపూర్ రేణుక ఎల్లమ్మ, పోచమ్మ దేవాలయం సమీపంలో నేరుగొండ సాయి అనే వ్యక్తి వద్ద 9 ఎల్ఎస్డి బాస్ట్స్లను ఎస్టీఎప్ ఏ టీమ్ పట్టుకున్నారు. సాయిపై కేసు నమోదు చేసి కుత్భుల్లాపూర్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించామని ఏ టీమ్ లీడర్ అంజి రెడ్డి తెలిపారు.
మరో కేసులో బెంగూళూరు నుంచి హైదరాబాద్కు వచ్చి నివాసముంటున్న దేశిక్ అనే వ్యక్తి హైదారాబాద్ బంజారా హీల్స్ రోడ్డు నెంబ ర్ 3లోని 4.69 ఎండిఎంఎ డ్రగ్స్ అమ్ముతుండగా ఎక్సైజ్ ఎస్టి ఎఫ్బి టీం ఎస్సై బాలరాజ్ సిబ్బంది పట్టుకున్నారు. బెంగూళూరులో నైజీరియన్ వద్ద కొనుగోలు చేసి హైదరాబాద్లో అమ్మకాలు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు. నిందితుడిని, డ్రగ్స్ను అమీర్పేట్ స్టేషన్లో అప్పగించారు.