బక్రీద్ పండుగ సందర్భంగా హైదరాబాద్లో పటిష్ట భద్రత: సీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్: బక్రీద్ పండుగను పురస్కరించుకొని, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయబడ్డాయి. ముఖ్యమైన ప్రాంతాలలో చెక్పోస్టులు ఏర్పాటు చేసి, నిఘాను ముమ్మరం చేశారు. సీవీ ఆనంద్ ఐపీఎస్, డైరెక్టర్ జనరల్ - హైదరాబాద్ పోలీస్ కమిషనర్, ఈ చెక్పోస్టులు ఎంజె బ్రిడ్జ్, హసన్ నగర్ బండ్లగూడ , జియాగూడ గోశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్పోస్టుల వద్ద విధులలో ఉన్న పోలీసు సిబ్బందితో మాట్లాడి, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా, చెక్పోస్టుల వద్ద ఉన్న అధికారులకు మరియు సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. బక్రీద్ పండుగ ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలను కాపాడటంలో ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి స్నేహమేరా డీసీపీ సౌత్ జోన్, ఎస్ చైతన్య కుమార్ డిసిపి సౌత్ ఈస్ట్ జోన్, చంద్రమోహన్ డిసిపి సౌత్ వెస్ట్, డిసిపి ఆర్ వెంకటేశ్వర్లు ట్రాఫిక్ మరియు అడిషనల్ డీసీపీ టాస్క్ఫోర్స్ జోన్ ఇతర అధికారులు పాల్గొన్నారు.