పిస్తా హౌస్ హోటల్‌లో అగ్ని ప్రమాదం..

By Ravi
On
పిస్తా హౌస్ హోటల్‌లో అగ్ని ప్రమాదం..

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం అశోక్ నగర్‌లోని పిస్తా హౌస్ హోటల్‌లో శుక్రవారం సాయంత్రం స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. నాల్గవ అంతస్తులో కిచెన్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు స్పష్టం చేశారు. హోటల్‌లోని సిబ్బంది, కస్టమర్లు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. IMG-20250606-WA0100షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Advertisement

Latest News

రసాయన ట్యాంకర్ ను పట్టుకున్న ఎస్ఓటి పోలీసులు.. రసాయన ట్యాంకర్ ను పట్టుకున్న ఎస్ఓటి పోలీసులు..
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా రసాయన వ్యర్ధాలను తరలిస్తున్న  ట్యాంకర్ సుతారిగూడలో  మేడ్చల్ ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. మేడ్చల్ పిఎస్ పరిధిలో అక్రమంగా ప్రమాదకర రసాయన...
ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై మున్సిపల్ అధికారుల దాడులు..
మద్యం మత్తులో కారు డ్రైవ్.. ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు మృతి..
పనులన్నీ పక్కన పెట్టి పరుగున వచ్చిన కేటీఆర్..
జనసేనలో భగ్గుమన్న అసంతృప్తి.. సోషల్ మీడియాలో ఘాటు ప్రశ్నలు
పిస్తా హౌస్ హోటల్‌లో అగ్ని ప్రమాదం..
వాస్కోడిగామా రైల్ లో సోదాలు.. భారీగా మద్యం బాటిళ్ల స్వాధీనం..