ట్రావెల్ బ్యాగ్ లో డెడ్ బాడీ కేసును ఛేదించిన పోలీసులు..
By Ravi
On
మేడ్చల్ జిల్లా: బాచుపల్లిలో బుధవారం కలకలం రేపిన ట్రావెల్ బ్యాగ్లో యువతి మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. మృతురాలు నేపాల్కు చెందిన యువతిగా గుర్తించారు. నిందితుడు నేపాల్కు చెందిన విజయ్ ని అదుపులోకి తీసుకున్నారు. మే 23న యువతిని హత్య చేసి ట్రావెల్ బ్యాగ్లో పెట్టి పడేసినట్లు కెపిహెచ్బి లో నిందితుడు సూట్కేసు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఇద్దరు గత నెలలో కలిసి నగరానికి వచ్చి బాచుపల్లి లో ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో నిందితుడు, మృతురాలు పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రాగా హత్య చేసినట్లు తెలుస్తోంది.
Latest News
06 Jun 2025 19:22:43
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం అశోక్ నగర్లోని పిస్తా హౌస్ హోటల్లో శుక్రవారం సాయంత్రం స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. నాల్గవ అంతస్తులో కిచెన్ లో షార్ట్...