రాజేంద్రనగర్ లో దారుణం.. దంపతుల హత్య..

By Ravi
On
రాజేంద్రనగర్ లో దారుణం.. దంపతుల హత్య..

  • బద్వేల్ లో దంపతులను గొంతుకోసి హత్య చేసిన దుండగులు
  • ఫిజియోథెరఫీ పేరుతో అపార్ట్మెంట్ లోకి చొరబడ్డ అగంతకులు
  • సంఘటన స్థలానికి చేరుకున్న డిసిపి శ్రీనివాస్

రంగారెడ్డి: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి బుద్వేలు జనచైతన్య వెంచర్ లో డబుల్ మర్డర్ తీవ్ర కలకలం రేపింది. అబ్రిజ్ రెసిడెన్సీ అపార్ట్ మెంట్ 5వ అంతస్తులో ఉన్న షేక్ అబ్దుల్లా(70) , రిజ్వానా (65) దంపతులను దుండగులు దారుణంగా హతమార్చారు. ఫిజియోథెరఫీ పేరుతో ఇద్దరు వచ్చినట్లు అపార్ట్మెంట్ వాసులు చెబుతున్నారు. ఒకరు మాస్క్ పెట్టుకోగా, మరొకరు బురఖాలో ఉన్నట్లు, బురఖాలో ఉన్న వ్యక్తి వాచ్ మెన్ తో మాట్లాడినట్లు తెలుస్తోంది.  లోపలికి వెళ్లిన వెంటనే వారిని గోతుకోసి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు పైకి వెళ్ళిన తరువాత 40 నిమిషాలకు ఒకరు తరువాత కాసేపటికి మరొకరు వచ్చినట్లు వాచ్ మెన్ చెబుతున్నాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో  ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. రాజేంద్రనగర్ డీజీపీ శ్రీనివాస్ దర్యాప్తు చేస్తున్నారు.  దొంగతనానికి వచ్చి డబ్బుల కోసం హత్య చేశారా, లేక మరేదైనా కారణమా అన్న కోణంలో విచారణ చేస్తున్నామని తెలిపారు. దుండగుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. అపార్ట్మెంట్ లో ఉన్న సిసి ఫుటేజ్ సేకరించారు. మృతుల్లో రిజ్వానా రిటైర్డ్ లెక్చరర్ కాగా, భర్త షేక్ అబ్దుల్లా రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి.

Advertisement

Latest News