ఇంకా మూడురోజులే ఉంది త్వరపడండి..
హైదరాబాద్: ఎక్సైజ్ శాఖ జీహెచ్ఎంసీలోని 24 బార్లను పునరుద్దరణకు దారఖాస్తులను ఆహ్వానించింది. వీటితో పాటుగా సరూర్నగర్ జల్పల్లి, మహబూబ్నగర్, నిజమాబాద్, బోధన్లో ఒక్కొక్క బార్కు దరఖాస్తులకు ప్రకటన చేసింది. జీహెచ్ఎంసీలో 24 బార్లకు 359 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 6 వరకు గడువు ఉందని అధికారులు తెలిపారు. 24 బార్లకు మిగిలిన మూడు రోజుల్లో భారీగా దరఖాస్తులు వస్తామని అంచనాలు వేస్తున్నారు. దీనికి కారణం ఈ మధ్యనే రూరల్లోని బార్లకు పిలిచిన బార్లకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. మిగిలిన జిల్లాలో 25 బార్లకు 1400 వందల మేర దరఖాస్తులు అందాయి. ఈ మూడు రోజుల్లో బార్లకు వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని భావించి నాంపల్లిలోని అబ్కారీ భవన్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దరఖాస్తులు తీసుకొవడానికి నాంపల్లి కార్యాలయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని రంగారెడ్డి డిప్యూటి కమిషనర్ పి.దశరథ్ తెలిపారు.