ఇంకా మూడురోజులే ఉంది త్వరపడండి..

By Ravi
On
ఇంకా మూడురోజులే ఉంది త్వరపడండి..

హైదరాబాద్‌: ఎక్సైజ్‌ శాఖ జీహెచ్‌ఎంసీలోని 24 బార్లను  పునరుద్దరణకు దారఖాస్తులను ఆహ్వానించింది.  వీటితో పాటుగా  సరూర్‌నగర్‌ జల్‌పల్లి, మహబూబ్‌నగర్‌, నిజమాబాద్‌,  బోధన్‌లో ఒక్కొక్క బార్‌కు దరఖాస్తులకు ప్రకటన చేసింది. జీహెచ్‌ఎంసీలో  24 బార్లకు 359 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 6 వరకు గడువు ఉందని అధికారులు తెలిపారు. 24 బార్లకు మిగిలిన మూడు రోజుల్లో భారీగా దరఖాస్తులు  వస్తామని అంచనాలు వేస్తున్నారు. దీనికి కారణం ఈ మధ్యనే రూరల్‌లోని  బార్లకు పిలిచిన బార్లకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. మిగిలిన జిల్లాలో 25 బార్లకు 1400 వందల మేర దరఖాస్తులు అందాయి.  ఈ మూడు రోజుల్లో బార్లకు వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని భావించి నాంపల్లిలోని అబ్కారీ భవన్‌లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దరఖాస్తులు తీసుకొవడానికి నాంపల్లి కార్యాలయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని రంగారెడ్డి డిప్యూటి కమిషనర్‌  పి.దశరథ్‌ తెలిపారు.

Advertisement

Latest News