రేపటి నుండి తార్నాక సిగ్నల్ క్లోజ్...
By Ravi
On
హైదరాబాద్: రేపటి నుంచి తార్నాక సిగ్నల్ క్లోజ్ చేస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ స్పష్టం చేశారు. ఈ మేరకు తార్నాక చౌరస్తాను పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పలు ట్రాఫిక్ సమస్యల కారణంగా ప్రజల ఇబ్బందులను, వాహనదారుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని తాత్కాలికంగా సిగ్నల్ క్లోజ్ చేస్తున్నట్టు తెలిపారు. జిహెచ్ఎంసి అధికారులతో రోడ్డు వెడల్పుకు సంబంధించిన దాని గురించి మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇక చౌరస్తాలో రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్ ఉండవని నేరుగా వెళ్లి యూ టర్న్ తీసుకొని వెళ్లాలని, వాహనదారులు సహకరించాలని కోరారు.
Tags: #hyderabadtrafficpolice#
Related Posts
Latest News
06 Jun 2025 19:22:43
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం అశోక్ నగర్లోని పిస్తా హౌస్ హోటల్లో శుక్రవారం సాయంత్రం స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. నాల్గవ అంతస్తులో కిచెన్ లో షార్ట్...