రేపటి నుండి తార్నాక సిగ్నల్ క్లోజ్...

By Ravi
On
రేపటి నుండి తార్నాక సిగ్నల్ క్లోజ్...

హైదరాబాద్: రేపటి నుంచి తార్నాక సిగ్నల్ క్లోజ్ చేస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ స్పష్టం చేశారు. ఈ మేరకు తార్నాక చౌరస్తాను పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పలు ట్రాఫిక్ సమస్యల కారణంగా ప్రజల ఇబ్బందులను, వాహనదారుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని తాత్కాలికంగా సిగ్నల్ క్లోజ్ చేస్తున్నట్టు తెలిపారు. జిహెచ్ఎంసి అధికారులతో రోడ్డు వెడల్పుకు సంబంధించిన దాని గురించి మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇక చౌరస్తాలో రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్ ఉండవని నేరుగా వెళ్లి యూ టర్న్ తీసుకొని వెళ్లాలని, వాహనదారులు సహకరించాలని కోరారు.

Advertisement

Latest News