కేబుల్ బ్రిడ్జ్ పై కారులో చెలరేగిన మంటలు..
By Ravi
On
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై హోండాసిటీ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. మాదాపూర్ నుండి జూబ్లీహిల్స్ వైపు వెళుతుండగా ప్రమాదం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు క్షేమంగా బయట పడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు.
Tags: #madhapurpolicestation#
Related Posts
Latest News
07 Jun 2025 05:49:28
జనసేనలో భగ్గుమన్న అసంతృప్తి.. సోషల్ మీడియాలో ఘాటు ప్రశ్నలు
తుని రైలు దగ్ధం కేసు ఫైలును కదిపినందుకు అలజడి రేగింది. కాని ఇప్పుడు జనసేన తన పార్టీలో...