తెలంగాణ డీజీపీకి NHRC నోటీసులు...

By Ravi
On
తెలంగాణ డీజీపీకి NHRC నోటీసులు...

తెలంగాణ డీజీపీ జితేందర్ కి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. రాజేంద్రనగర్ పోలీస్ పరిధిలో 33ఏళ్ల ఆటో-రిక్షా డ్రైవర్ ను  మే 13న పోలీసులు శారీరక హింసకు గురి చేయడంతో మృతి చెందాడని మీడియాలో కథనాలను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఘటనపై రెండు వారాల్లోగా వివరణాత్మక నివేదిక ఇవ్వాలని కోరుతూ తెలంగాణ DGPకి నోటీసు జారీ చేసింది. మీడియా కథనాల్లో విషయాలు నిజమైతే, బాధితుడి మానవ హక్కులను తీవ్రంగా ఉల్లంఘించినట్లుగా భావించాల్సి వస్తుందన్న కమిషన్ నోటీసులో పేర్కొంది.

Advertisement

Latest News