తెలంగాణ డీజీపీకి NHRC నోటీసులు...
By Ravi
On
తెలంగాణ డీజీపీ జితేందర్ కి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. రాజేంద్రనగర్ పోలీస్ పరిధిలో 33ఏళ్ల ఆటో-రిక్షా డ్రైవర్ ను మే 13న పోలీసులు శారీరక హింసకు గురి చేయడంతో మృతి చెందాడని మీడియాలో కథనాలను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఘటనపై రెండు వారాల్లోగా వివరణాత్మక నివేదిక ఇవ్వాలని కోరుతూ తెలంగాణ DGPకి నోటీసు జారీ చేసింది. మీడియా కథనాల్లో విషయాలు నిజమైతే, బాధితుడి మానవ హక్కులను తీవ్రంగా ఉల్లంఘించినట్లుగా భావించాల్సి వస్తుందన్న కమిషన్ నోటీసులో పేర్కొంది.
Tags: #dgptelangana#
Latest News
06 Jun 2025 19:22:43
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం అశోక్ నగర్లోని పిస్తా హౌస్ హోటల్లో శుక్రవారం సాయంత్రం స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. నాల్గవ అంతస్తులో కిచెన్ లో షార్ట్...