ఘట్కేసర్ ఓఆర్ఆర్ పై అయిదుగురు అరెస్ట్. 58.8కేజీల గంజాయి స్వాధీనం
మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధి ఘట్కేసర్ ఓఆర్ఆర్ వద్ద 58.8కిలోల పొడి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా నుండి ఆదిలాబాద్, ఆదిలాబాద్ టు పూణే తరలించేందుకు ఐదుగురు వ్యక్తులు కారులో తరలిస్తుండగా ఓఆర్ఆర్ ఘట్కేసర్ వద్ద ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుండి 58.8కిలోల పొడి గంజాయి, ఐదు మొబైల్ ఫోన్స్, కారు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ పి. దశరథ మాట్లాడుతూ ఒరిస్సాలోని సునీల్ జన్నె నుండి 29 బండిల్ పొడి గంజాయి, కేజీకి 1900 రూపాయల చొప్పున కొనుగోలు చేశారు. వీటిని కిలోకి ఐదు వేల చొప్పున అమ్మకాలు చేపడతారు. గోవింద్ తప్సలే (36), గజానంద్(21), పవన్(25), ఆకాష్(32) రాహుల్ (31) ఈ నలుగురు వ్యక్తులు బీదర్ జిల్లా కర్ణాటక కు చెందిన వ్యక్తులు, అంబేద్కర్ నగర్ అదిలాబాద్ చెందిన మరో వ్యక్తి రాహుల్(31) అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అదిలాబాదులోకి చెందిన రాహుల్ పూణేలో ఉండే అభిషేక్ తరలించేందుకు కారులో ప్లాన్ చేశారని రాహుల్ పై గతంలో కేసులు ఉన్నట్లు వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో మల్కాజిగిరి ఎక్సైజ్ అధికారి నవీన్ కుమార్, ఘట్కేసర్ ఎక్సైజ్ సిఐ జూపల్లి రవి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.