30మందికి క్యాష్ రివార్డ్స్ అందించిన ఎక్సైజ్ డైరెక్టర్
ఎన్ఫోర్స్మెంట్కు వన్నె తెచ్చేలా ప్రతిభ కనిబరిచిన 30 మందికి క్యాష్ రివార్డులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం అందించారు. సిబ్బంది క్రైమ్ కంట్రోల్పై ఉక్కు పాదం మోపాలని, ఎన్ఫొర్స్ బాగా పని చేస్తే డిపార్ట్మెంట్కు మంచి పేరు వస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. డైరెక్టర్ చాంబర్లో ప్రతిభ కనబరిచిన కొత్తగూడం, భద్రాచలం, శంషాబాద్, సరూర్నగర్, సంగారెడ్డి, మల్కాజ్గిరి ఈఎస్ పరిధిలో గంజాయి, డ్రగ్స్, ఆల్పోజోలం పట్టుకున్న ఎన్ఫోర్స్, డిటీఎప్ టీమ్లకు సిబ్బందికి క్యాష్ రివార్డులను డైరెక్టర్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి, అసిస్టెంట్ కమిషనర్ ప్రణవిలు పాల్గోన్నారు.
..మర్యాదాపూర్వకంగా డైరెక్టర్ను కలిసిన డీసీలు, ఏసీలు..
ఎన్ఫొర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీంను వివిధ జిల్లాల నుంచి వచ్చిన డిప్యూటి కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూలమొక్కలను అందించిన ఎక్సౌజ్ శాఖకు కొత్తగా డైరెక్టర్గా వచ్చినందుకు షానవాజ్ ఖాసీంకు శుభాకాంక్షలు తెలిపారు. డైరెక్టర్ను కలిసివారిలో మెదక్, వరంగల్, కరీంనగర్, నల్లగొండ, నిజామాబాద్, ఖమ్మం డిప్యూటి కమీషనర్లు హరి కిషన్, అంజన్రావు, డెవిడ్ రవికాంత్, శ్రీనివాసరెడ్డి, సోమిరెడ్డి, జనార్థన్రెడ్డిలతోపాటు అసిస్టెంట్ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరిండెంట్లు వున్నారు.