ఓల్డ్ సిటీ బాబానగర్ లో టెన్షన్... భారీ బందోబస్తు

By Ravi
On
ఓల్డ్ సిటీ బాబానగర్ లో టెన్షన్... భారీ బందోబస్తు

పాతబస్తీలో ఫుల్ టెన్షన్ నెలకొంది. చాంద్రాయణగుట్టలో తెల్లవారుజామున హైడ్రా రంగంలోకి దిగడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. బాబానగర్ సర్వే నెంబర్ 303, 306 కి చెందిన 2000 గజాల స్థలం ఆక్రమణకు గురైనట్లు హైడ్రాకి ఫిర్యాదులు అందాయి. దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ విచారణ చేపట్టిన అనంతరం కూల్చివేతలు మొదలు పెట్టారు. దీనితో ఆగ్రహించిన ఎంఐఎం నేతలు, బాబానగర్ వాసులు ఆందోళనకు దిగారు. రంగనాథ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ కూల్చివేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన చేసిన పలువురిని అదుపులోకి తీసుకొని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కబ్జాకు గురైన 2000 గజాల స్థలంలో నిర్మాణం అయిన భవనాలను నేలమట్టం చేసి స్థలం స్వాదీనం చేసుకున్నారు.

Tags:

Advertisement

Latest News

ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి షాక్ ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి షాక్
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై. శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఊహించని పరిణామం ఎదురైంది. ఈ కేసు నుంచి ఆమెను విముక్తురాలిని చేస్తూ...
లోప రహిత క్రమశిక్షణ.. అప్పీల్ కేసుల నిర్వహణపై సదస్సు
నార్సింగిలో విషాదం.. అగ్నిప్రమాదంలో కొరియోగ్రాఫర్ మృతి
55ఏళ్ల తరువాత వార్ సైరన్లు వాడాము.. సీపీ ఆనంద్
జవహర్ నగర్ లో విషాదం.. లిఫ్ట్ తెగిపడి ముగ్గురు మృతి
పేరుకి కార్ల వ్యాపారం.. చేసేది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విక్రయం
అదరగొట్టిన ఆపరేషన్ అభ్యాస్