చిట్టి డబ్బులు ఇవ్వలేదని ఎంత పని చేశారు..

By Ravi
On
చిట్టి డబ్బులు ఇవ్వలేదని ఎంత పని చేశారు..

చిట్టీ డబ్బు విషయంలో తలెత్తిన గొడవలో ఓ మహిళ కుడిచేతి చూపుడు వేలిని చిట్టి నిర్వాహకుడు గట్టిగా కొరికేశాడు. దీంతో ఊడిపోయిన వేలిని పట్టుకుని ఆస్పత్రికి వెళ్లినప్పటికీ అతికించలేమని వైద్యులు తేల్చిచెప్పారు. హైదరాబాద్ మధురానగర్ పోలీస్టేషన్ పరిధిలోని జవహర్ నగర్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. జవహర్ నగర్ కు చెందిన సుజిత ఇంట్లోని పెంట్ హౌస్ లో మూడేండ్ల నుంచి మమత అద్దెకు ఉంటుంది. మమత చిట్టీల వ్యాపారం చేసేది. మమతకు రూ.30 వేలు చిట్టీ డబ్బులు సుజిత ఇవ్వాల్సి ఉంది. ఇటీవల మమత ఇల్లు ఖాళీ చేసి వెళ్లింది.  చిట్టీ డబ్బులు వసూలు చేసుకునేందుకు సుజిత ఇంటికి మమత, ఆమె భర్త హేమంత్ వచ్చారు. చిట్టి డబ్బులుIMG-20250519-WA0012 ఇవ్వాలని పట్టుబట్టారు ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. సుజిత తల్లి లత(45) అడ్డురావడంతో ఆమె కుడి చెయ్యి చూపుడు వేలిని హేమంత్ కొరికేశాడు. ఊడిన వేలిని పట్టుకుని ఆసుపత్రికి పరుగులు తీయగా, ఆ వేలిని అతికించలేమని వైద్యులు తేల్చిచెప్పారు. సుజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి హేమంత్ ను అరెస్ట్ చేశారు.

Tags:

Advertisement

Latest News

రోడ్డుప్రమాదంలో మరణించిన హోంగార్డ్ కుటుంబానికి చెక్కు అందజేత రోడ్డుప్రమాదంలో మరణించిన హోంగార్డ్ కుటుంబానికి చెక్కు అందజేత
విధినిర్వహణలో రోడ్డుప్రమాదంలో మరణించిన హోం గార్డు అధికారికి  రూ.6.28 లక్షల చెక్కును సైబరాబాద్ జాయింట్ సీపీ ట్రాఫిక్ డా. గజరావ్ భూపాల్ అందజేశారు. మియాపూర్ ట్రాఫిక్ పోలీస్...
సైబరాబాద్ కమిషనరేట్ లో సురక్షా కవచ్ పై అవగాహన కార్యక్రమం
ఆదిలాబాద్ బస్ డిపోను తనిఖీ చేసిన ఎండి సజ్జనార్
పేలుళ్లకు కుట్ర పన్నిన సమీర్ ఉండేది ఇక్కడే...
రక్తం కారేలా కొట్టుకున్న intuc నేతలు
రైతుల పంటల సాగుపై అవగాహన
ఒకేసారి మూడు తరాలు అగ్నికి ఆహుతి