కారు బీభత్సం.. బాలుడు మృతి.. బాలికకు గాయాలు

By Ravi
On
కారు బీభత్సం.. బాలుడు మృతి.. బాలికకు గాయాలు

సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్ మండలం నర్రెగూడెం మైదానంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రోడ్డుప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందగా, మరో బాలిక తీవ్రంగా గాయపడింది. మనివర్మ (10) ఏకవాణి (12) అనే ఇద్దరు చిన్నారులు మైదానంలో ఆడుకుంటున్నారు. అదే సమయంలో, గ్రౌండ్ లోకి కారు నడుపుకుంటూ వచ్చిన మహిళ వారిని ఢీకొటింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మనివర్మను హుటాహుటిన పనాసియా ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఏకవాణికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను హరణ్య ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మృతి చెందిన మనివర్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరులోని మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై అమీన్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. IMG-20250519-WA0038

Tags:

Advertisement

Latest News

పేలుళ్లకు కుట్ర పన్నిన సమీర్ ఉండేది ఇక్కడే... పేలుళ్లకు కుట్ర పన్నిన సమీర్ ఉండేది ఇక్కడే...
హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటలీజెన్సీ జాయింట్ ఆపరేషన్ లో పోలీసులకు చిక్కిన సమీర్, సిరాజ్ కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం...
రక్తం కారేలా కొట్టుకున్న intuc నేతలు
రైతుల పంటల సాగుపై అవగాహన
ఒకేసారి మూడు తరాలు అగ్నికి ఆహుతి
రూ. 300కోట్ల ప్రభుత్వ స్థలం కబ్జాకు యత్నం.. నిందితులపై నాన్ బెయిలబుల్ కేస్
మేడ్చల్ లో మరో దారుణ హత్య
కారు బీభత్సం.. బాలుడు మృతి.. బాలికకు గాయాలు