హిమాయత్ నగర్ లో పోలీసుల దాడి.. ముగ్గరు బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్
By Ravi
On
సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్, దోమలగూడా పోలీసులు సంయుక్తంగా హిమాయత్ నగర్ లోని పావనీ లింగయ్య అపార్ట్మెంట్ పై దాడి చేశారు. అపార్ట్మెంట్ లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న సిరాజ్, సాయినాథ్, గోపీనాథ్ లను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి లక్ష 20వేల రూపాయల నగదు, 3 సెల్ ఫోన్స్, స్వాదీనం చేసుకున్నారు. అపార్ట్మెంట్ లో గత కొద్దిరోజులుగా ఈ ముఠా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తేలింది. ఈ ముఠా www. Radheexch. com అనే వెబ్ సైట్ ద్వారా బెట్టింగ్ జరుపుతున్నట్లు సమాచారం.
Tags:
Latest News
01 May 2025 22:08:14
బీజేపీ నాయకుడు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన ఒక క్రిమినల్ కేసును రద్దు చేయాలని కోరుతూ ఆయన...