నిర్మాణంలో ఉన్న భవనం వద్ద అల్యూమినియం సెంట్రింగ్ చోరీ.. 7గురు అరెస్ట్
By Ravi
On
నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద అల్యూమినియం సెంట్రింగ్ పానెల్స్ ను దొంగిలిస్తున్న ముఠాను మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాచుపల్లి లో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద 7 లక్షల రూపాయల విలువైన అల్యూమినియం సెంట్రింగ్ పానెల్స్ ను దుండగులు ఎత్తుకుపోయారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని ముఠాలోని ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ ముఠా లోని నిందితులు గతంలో సైతం చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లినట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. నిందితుల వద్ద నుండి రెండు ఆటోలు 7 లక్షల రూపాయల విలువైన అల్యూమినియం సెంట్రింగ్ పానెల్స్ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.
Tags:
Latest News
01 May 2025 20:26:54
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తికాగానే జాబ్ క్యాలెండర్ వేగంగా అమలులోకి వస్తుందని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డా. రియాజ్ పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్లోని...