రాంగోపాల్ పేట పిఎస్ కి ఓ ప్రత్యేక ఉంది. సీపీ సి.వి. ఆనంద్..

By Ravi
On
రాంగోపాల్ పేట పిఎస్ కి ఓ ప్రత్యేక ఉంది. సీపీ సి.వి. ఆనంద్..

 హైదరాబాద్: పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ సికింద్రాబాద్‌లోని జేమ్స్ స్ట్రీట్‌లో ఉన్న రామ్ గోపాల్ పేట పోలీస్ స్టేషన్ భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) వారు ఈ భవనానికి మరమ్మత్తులు నిర్వహించి, హైదరాబాద్ సిటీ పోలీసులకు తిరిగి అప్పగించడం జరిగిందని తెలిపారు.
ఈ జేమ్స్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ భవనం 1900 సంవత్సరంలో నిర్మించబడిందని, 2016 వరకు 116 సంవత్సరాల సుదీర్ఘ కాలం రామ్ గోపాల్ పేట పోలీస్ స్టేషన్‌గా సేవలందించిందని కమిషనర్  వివరించారు. ఈ భవనానికి మరమ్మత్తుల అవసరం ఏర్పడటంతో, తొమ్మిది సంవత్సరాల క్రితం ఈ పోలీస్ స్టేషన్‌ను మినిస్టర్ రోడ్‌లోని అద్దె భవనంలోకి మార్చారు. గతంలో తాను డీసీపీ సెంట్రల్ జోన్‌గా ఉన్నప్పుడు ఈ భవనం నుంచే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని, ఈ భవనానికి చాలా ప్రత్యేకత ఉందని ఆయన గుర్తు చేసుకున్నారు. రానున్న కొద్ది రోజుల్లో రామ్ గోపాల్ పేట పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన వస్తువులను తిరిగి ఈ భవనంలోకి తరలించి, హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి  పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయిస్తామని కమిషనర్ తెలిపారు. అయితే, ప్రస్తుతం పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగిందని, వాటి పార్కింగ్ సదుపాయం కోసం ప్రయత్నిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మన హైదరాబాద్ నగరంలో ఉన్న పురాతనమైన (చారిత్రక ప్రాముఖ్యత కలిగిన) కట్టడాలను భావితరాల కోసం కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ సిటీ పోలీస్‌కు సంబంధించిన పురాణి హవేలీలోని కమిషనర్ కార్యాలయానికి గత మూడు సంవత్సరాలుగా మరమ్మత్తులు జరుగుతున్నాయని, అది కూడా త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని కమిషనర్ తెలిపారు. పురాణి హవేలీలోని కమిషనర్ కార్యాలయం ప్రారంభించిన తర్వాత, ప్రతి శుక్రవారం తాను అక్కడి నుండే విధులు నిర్వహిస్తానని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్. రష్మి పెరుమాల్, డీసీపీ నార్త్ జోన్, మరియు రాహుల్ హెడ్గే డీసీపీ ట్రాఫిక్ తోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.IMG-20250603-WA0089

Advertisement

Latest News