జనసేనలో భగ్గుమన్న అసంతృప్తి.. సోషల్ మీడియాలో ఘాటు ప్రశ్నలు

On
జనసేనలో భగ్గుమన్న అసంతృప్తి.. సోషల్ మీడియాలో ఘాటు ప్రశ్నలు

జనసేనలో భగ్గుమన్న అసంతృప్తి.. సోషల్ మీడియాలో ఘాటు ప్రశ్నలు

తుని రైలు దగ్ధం కేసు ఫైలును కదిపినందుకు అలజడి రేగింది. కాని ఇప్పుడు జనసేన తన పార్టీలో వారికే వార్నింగ్ ఇస్తూ రిలీజ్ చేసిన నోట్ మరింత అలజడి రేపింది. ఏకంగా పవన్ నే ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతూ జనసేన కేడర్ భగ్గుమంటున్నారు. అసలు ఇష్యూ తుని కేసు అయినా.. కేడర్ మొత్తం సొంత పార్టీ ఎమ్మెల్యేల అవినీతి గురించి, టీడీపీ నేతల వివక్ష గురించి ప్రశ్నిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్సీ పసుపులేటి హరి ప్రసాద్ పేరుతో రిలీజ్ అయిన నోట్ సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. దాని కింద కామెంట్లలో కసిగా స్పందించారు జనసైనికులు.

అసలు పార్టీ ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారు.. వాళ్ల సంగతేంటి.. వాళ్లనేం ప్రశ్నించరా.. మాకెందుకు వార్నింగులు అంటున్నారు. ఇక చాలా నియోజకవర్గాల్లో టీడీపీ వాళ్లు మమ్మల్ని దూరంగా పెడుతున్నారు.. ఉన్నది కూటమి ప్రభుత్వమా టీడీపీ ప్రభుత్వమా.. మాకు ఏ హక్కులు లేవా అంటూ నిలదీస్తున్నారు. రేషన్ మాఫియాపై మంత్రి నాదెండ్ల మనోహర్ కొన్ని చోట్ల తనిఖీలు చేశారు... పవన్ కల్యాణ్ సీజ్ ద షిప్ అన్నారు.. అయినా రేషన్ మాఫియా ఆగలేదు.. దానిని నడిపిస్తున్నవాళ్ల మీద కేసులు లేవు.. పైగా వారిలో జనసేన ఎమ్మెల్యేలు, నేతలు కూడా చేరారు.. దీనిపై పవన్ ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు.

ఇక టీడీపీ ఎమ్మెల్యేలు అయితే ఘోరమైన వివక్ష చూపిస్తున్నారు. పెడనలో ముఖ్యమైన లోకల్ నేత ఆత్మహత్యాయత్నం చేసి.. ఎలాగో బతికి బయటపడ్డాడు. కాని ఆ సంఘటన మన బలహీనతను.. టీడీపీ వాళ్ల వివక్షను బయటపడేసింది. కాని ఏమైనా చర్యలు తీసుకున్నారా.. ఏమైనా పరిస్ధితిని మార్చారా.. లేదు కదా.. మరేం చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు.

ఈ మధ్య తిరువూరుకు చెందిన నేత ఇసుక అక్రమ వ్యాపారంపై కామెంట్ చేశారు. ఇలా చేస్తే ఎలా.. మనం ప్రభుత్వంలో ఉండి కూడా ఇలా చేయనిస్తే ఎలా అని ప్రశ్నించారు. అందుకు ఆయన నోటీసు వెళ్లింది. సరే నోటీసుకు సమాధానం ఇస్తూ వివరణ రాసిన లేఖ ఇవ్వాలని ఆఫీసుకు వెళ్లితే.. అక్కడ తీసుకునే దిక్కు లేదంట. ఇక ఏం చెప్పాలి.. పార్టీ ఆఫీసు ఎలా నడుపుతున్నారో.. అంటూ ఓ కామెంట్ వచ్చింది.

చాలా చోట్ల ఎమ్మెల్యేల అవినీతిపై బహిరంగంగానే చర్చ నడుస్తోంది. దీనిపై పవన్ కూడా వారిని హెచ్చరించినట్లు లీకులొచ్చాయి.. కాని ఆ వార్నింగ్ ఇచ్చినట్లే అనిపించడం లేదు. ఎందుకంటే ఆ అవినీతి కొనసాగుతూనే ఉంది.. ఏ ఎమ్మల్యే కూడా తీరు మార్చుకున్నట్లే కనపడటం లేదంటున్నారు. వారి సంగతి చూడండి ముందు అంటున్నారు.

అసలు ఇదంతా తుని రైలు దగ్ధం కేసుపై పునర్విచారణ కోరుతూ ప్రభుత్వం కోర్టుకెక్కడమే. దానిపై చాలామంది కాపు నేతలు నెగటివ్ గా స్పందించారు. ముద్రగడ టార్గెట్ అయితే అయిండొచ్చు.. కాని ఇది మా వర్గంపై దాడిలా అవుతుంది.. ఒక ఎమోషన్ ను టచ్ చేసినట్లు అవుతుంది.. పవన్ ఆపాలి కదా.. ఎందుకు ఆపలేదు అంటూ కామెంట్లు చేశారు. అందుకే పార్టీ సీరియస్ గా రియాక్ట్ అయింది. వార్నింగ్ లెటర్ ఇచ్చింది. అయితే అది మరింత రచ్చ రేపింది. అసలు ముద్రగడను వాడుకుని జగన్ చాలా చేశారు.. తుని రైలు దగ్ధం కూడా వైసీపీయే ప్లాన్ చేసిందని.. చేసింది కూడా వారేనని. కాని రిమార్క్ మాత్రం కాపు కులంపై పడిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ పవన్ ను వాడుకుని తమ వర్గాన్ని టార్గెట్ చేస్తుందనే ఆరోపణ వినిపిస్తున్నారు.

‘‘ఏదేమైనా.. పవన్ కల్యాణ్ పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలి. ఒక పద్ధతి ప్రకారం నడిపించాలి. క్రమశిక్షణ కిందోళ్లకే కాదు.. పవన్ తో సహా అందరికీ ఉండాలి. మీరేం చెబితే అదే ఫైనల్ కాదు. ముందు కింది వాళ్ల అభిప్రాయాలను తెలుసుకోండి... మీ చుట్టూ ఉన్నవాళ్లు చెప్పినవే నిజాలనుకోకండి. అందరం పార్టీ ముందుకు పోవాలనే కోరుకుంటున్నాం.. బలపడాలనే కోరుకుంటున్నాం. కాని అడగకూడదు.. మాట్లాడకూడదు.. ఆఫీసుకు రాకూడదు అంటే ఎలా కుదురుతుంది. మేం కూడా పార్టీ కోసమే పని చేస్తున్నాం. సంపాదించుకునేవాళ్లే మీకు నచ్చితే.. మేమేం చేయలేం.. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ గారు తెలుసుకోవాలి’’ అంటూ ఓ జనసేన నేత ఆవేదన వ్యక్తం చేశాడు.

Advertisement

Latest News

పద్మారెడ్డి కుటుంబ సభ్యులకు త్రిపుర గవర్నర్ పరామర్శ.. పద్మారెడ్డి కుటుంబ సభ్యులకు త్రిపుర గవర్నర్ పరామర్శ..
దివంగత బీజేపీ నేత పద్మారెడ్డి కుటుంబ సభ్యులను త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి నాచారంలోని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పద్మా రెడ్డి భారతీయ...
నూతన దుకాణ సముదాయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి..
మహిళ ఎస్ఐ పై దాడి కేసు.. 7గురు అరెస్ట్..
దంపతుల గొడవ మధ్యలో సర్ది చెప్పేందుకు వెళ్లింది...
సెల్ ఫోన్ పేలి యువకుడు మృతి..?
ఆదివారం ఉదయం 10గంటల నుండి ప్రారంభం..
హైదరాబాద్‌లో చేప ప్రసాదం 2025: తేదీలు ఖరారు