గోడవపడుతున్నాడని భర్తను హత్య చేసిన భార్య..
By Ravi
On
వనస్థలిపురం లో దారుణం జరిగింది. భర్తను హత్యచేసి ప్రమాదవశాత్తూ ఇంట్లో పడి చనిపోయాడు అని నమ్మించే యత్నం చేసింది ఓ భార్య. 8సంవత్సరాల క్రితం శిరీషను కిషన్ నాయక్ కులాంతర వివాహం చేసుకున్నాడు. నారాయణపురంకు చెందిన కిషన్ నాయక్ కు శిరీషకు మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీనితో భర్త ను వదిలి వనస్థలిపురం హిల్స్ కాలనీ లో ఒంటరిగా ఉంటోంది. పథకం ప్రకారం భర్తను ఇంటికి పిలిచి చున్నీతో ఉరివేసి హత్య చేసింది. కిషన్ నాయక్ కుటుంబ సభ్యుల పిర్యాదుతో హత్య ఉదంతం బయటపడింది. ఈ కేసులో శిరీషతో సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Related Posts
Latest News
30 May 2025 17:25:29
ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆవేదనతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. యాచారం మండలం చింతపట్ట గ్రామానికి చెందిన అశోక్ (47) అనే...